నందమూరి హీరో బాలకృష్ణ, బోయపాటి శీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడో సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కొంత మేర షూట్ జరుపుకుని ప్రస్తుతం కరోనా వైరస్ వలన ఆగిపోయింది. అయితే ఈ సినిమా త్వరలో షూట్ కి వెళ్లనున్నట్టు కొద్ది రోజుల నుండీ ప్రచారం జరుగుతోంది. కరోనా తగ్గాక లేదా వ్యాక్సిన్ వచ్చాకనే అని ఇతర టాలీవుడ్ సీనియర్ హీరోలు చెబుతున్నా బాలయ్య సినిమా మాత్రం వచ్చే నెలలోనే ఈచిత్రం సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలని అంటున్నాడని తొలుత ప్రచారం జరిగింది. కాస్త ముదురు హీరోలంతా కరోనా దెబ్బకి తమ సినిమా షూట్ లను అంతకంతకు వాయిదా వేసుకుంటూ పోతున్నారు.

బాలయ్య సమకాలీకులు అయిన చిరంజీవి, వెంకటేష్, నాగార్జునలలో ఒక్క నాగార్జున మాత్రమే మళ్ళీ లైన్ లోకి వచ్చాడు. బాలయ్య బాబు మాత్రం బోయపాటితో కలిసి చేస్తున్న మూడో చిత్రం విషయంలో అస్సలు వెనక్కి తగ్గడం లేదని ఈ సినిమాను ఎలాగైనా ఈ ఏడాది పూర్తి చేసేసి వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తేవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడని ప్రచారం జరిగింది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాని #BB3గా చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి రామోజీ ఫిల్మ్ సిటీలో వచ్చే నెల నుండి కొన్ని సీన్స్ ను షూట్ చేయనున్నారని అప్డేట్స్ వస్తున్నాయి.

అయితే అది నిజమే కానీ వచ్చే నెలలో బాలయ్య లేని సీన్స్ మాత్రమే షూట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. రకరాకాల పేర్లు ఈ సినిమా కోసం ప్రచారంలోకి రాగా ప్రస్తుతం ఈ సినిమాకు 'టార్చ్ బేరర్' అనే టైటిల్ అనుకుంటోందట చిత్ర బృందం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ సినిమా కోసం ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నారని ప్రచారం జరుగగా తాజాగా ఏమో మళయాళ హీరోయిన్ ప్రగ్యా మార్టిన్ ని ఫైనల్ చేశారని అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి: