టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే.. మన మహేష్ కి చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ బాబు ఎన్నో సందర్భాల్లో చెప్పాడు మనం చూసాం. ఇప్పుడు అదే  పిల్లల పట్ల సాయం చేయడంలో మహేష్ బాబు ఎప్పుడూ ముందే ఉంటాడు.అంతేకాదు తను చేసే సాయం అందరికి తెలియకుండా చూసుకుంటున్నాడు సూపర్ స్టార్. అలా రియల్ హీరో అనిపించుకుంటున్నాడు మహేష్ బాబు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు ఈయన. తాజాగా మరో ఇద్దరు చిన్నారులకు కూడా ప్రాణదానం చేసాడు మహేష్. సేవాగుణంలో నిజమైన హీరో అనిపించుకున్నాడు ఈయన.

ఒక్కరు ఇద్దరు కాదు.. 1020 మందికి పైగానే గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న చిన్నారులకు అవసరమైన సర్జరీలు చేయించాడు మహేష్ బాబు.  చిన్నారులకు గుండె సంబంధిత శస్త్ర చికిత్సలను చేయిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆంధ్రా హాస్పిటల్స్‌, లిటిల్‌ హార్ట్స్‌ ఫౌండేషన్స్‌తో కలిసి మహేష్ ఈ బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.మూడున్నరేళ్లలో వెయ్యి మందికి పైగా చిన్నారులకు మహేష్ గుండె ఆపరేషన్స్‌ చేయించడం విశేషం. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇద్దరు చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించారు. ఈ విషయాన్ని మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్‌ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మరో రెండు గుండెలు తమ కుటుంబంలో కలిశాయని నమ్రత తెలిపారు.

 "మరో రెండు గుండెలు మా కుటుంబానికి తోడయ్యాయి. ఇటీవల గుండె ఆపరేషన్స్‌ చేయించుకున్న ఇద్దరు చిన్నారులు ఆరోగ్యం కుదుటపడుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం.ఆంధ్రా హాస్పిటల్స్‌కు ధన్యవాదాలు" అని నమ్రత పోస్ట్ పెట్టారు.ఈ మేరకు మహేష్ బాబు చేసిన ఈ మంచి కార్యానికి వారి అభిమానులు ఎంతో ఆనందిస్తూ..తమ అభిమాన హీరోని సోషల్ మీడియాలో తెగ పొగిడేస్తున్నారు..ఇక ప్రస్తుతం మహేష్ సినిమాల విషయానికొస్తే పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది...!

మరింత సమాచారం తెలుసుకోండి: