ఇక ఈ ఏడాది జనవరిలో సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అయితే ఈ సినిమా పూర్తి అయిన వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబు రెస్ట్ మోడ్ లోకి వెళ్ళాడు. ఫ్యామిలీతో కలిసి ఆయన విదేశాలకి వెళ్లారు. కాలికి ఆపరేషన్ చేయించుకుని తన తదుపరి సినిమాకి ఒక ఆరు నెలలు రెస్ట్ తీసుకోవాలని అనుకున్నా ఇంతలో దేశంలోకి కరోనా ఎంటర్ కావడంతో ఆయన ఇంటికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. ఈ కరోన దెబ్బకు మహేష్ తదుపరి ప్రాజెక్ట్ సర్కారు వారి పాట అనుకున్న దానికంటే మరింత ఆలస్యం అవుతోంది.

ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తుండగా జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద మహేష్ కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. బ్యాకింగ్ కుంభకోణాల నేపధ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుంది అనే టాక్ నడుస్తుంది. ఈ సినిమా కథ ప్రకారం మొదటి షెడ్యూల్ అమెరికాలో చిత్రీకరించాల్సి ఉందట. అందుకే నవంబర్ నుండీ ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది అని తెలుస్తుంది.

అక్కడ సినిమాలోని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని అంటున్నారు. ఇప్పటికే ఈ టీమ్ కోసం వీసా ప్రాసెస్ అంతా జరుగుతోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ షూట్ కోసం మహేష్ ఫ్యామిలీ అంతటినీ తీసుకు వెళ్లనున్నాడని అంటున్నారు. ఈ సినిమాకి తమన్‌ సంగీతం అందిస్తుండగా, పిఎస్‌ వినోద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తోండగా, ఎడిటర్‌ మార్తాండ్‌ కె వెంకటేష్‌ సినిమా కోసం పనిచేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: