ప్రస్తుతం తెలంగాణను భారీ వర్షాలు ముంచేస్తున్నాయి.. ఇప్పటికీ కూడా ఆగకుండా వర్షం పడుతూనే ఉంది.. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ లో పలు జిల్లాల్లో చేతికొచ్చిన పంట నీట మునిగి పోయింది. హైదరాబాద్ పరిస్థితి మరీ దారుణంగా మారింది.. భారీగా ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో చాలా నిరాశ్రులయ్యారు. ఈ నేపథ్యం లో హైదరాబాదీల ను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ ప్రముఖుల తో పాటుగా, సినీ నటులు .. పెద్దలు ముందుకొస్తున్నారు. ఇప్పటికే చాలామంది తోచిన సొమ్మును విరాళంగా ఇచ్చారు..



ఈ మేరకు తాజాగా బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు  సాయమందించడానికి ముందుకొచ్చారు. మానవత్వం తో, సామాజిక సేవ తో ప్రతి ఒక్కరి మనసును గెలుచుకున్నాడు. తాను సంపాదించే మొత్తంలో కొంత భాగాన్ని ఆయన సామాజిక సేవకే ఉపయోగిస్తున్నారు. ఇటీవల కరోనా తో బాధపడుతున్న వారికి లక్ష రూపాయలు విరాళాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. ఆయన మనసు చాలా మంచిదని ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.



వరద బాధితులకు తన వంతు సాయంగా రూ.50 వేలు విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు సిద్ధిపేట శాసన సభ్యుడు, మంత్రి టి. హరీష్ రావును ఆయన నివాసంలో కలిసి చెక్ అందజేశారు.. సంపూ సినిమాలు ఉన్నా లేకున్నా కూడా ఇలా సాయం అందించడం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. పెద్ద మనసున్న చిన్న నటుడు సంపూ అని కొనియాడుతున్నారు. ఆయన్ని చూసైనా మరికొంత మంది సినీ నటులు ముందుకు వచ్చి తోచిన ఎమౌంట్ ను విరాళంగా అందజేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం సంపూ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి... మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ముంచెత్తుతునున్నాయనీ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: