టాలీవుడ్ లో ఇప్పుడు సినిమాలు వరుసగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా సైలెంట్ గా  ఉన్న స్టార్ హీరోలు ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోతున్నారు. ఇక అగ్ర హీరోల సినిమాలు అన్నీ కూడా సెట్స్ మీదకు వెళుతున్నాయి. అయితే కొన్ని సినిమాల విషయంలో మాత్రం ఇప్పుడు స్పష్టత రావడం లేదు. ప్రధానంగా బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా విషయంలో ఏ విధమైన స్పష్టత రాకపోవడంతో అటు నిర్మాతలు కూడా ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నారు.

ఈ సినిమాను త్వరలోనే మొదలు పెట్టే అవకాశం ఉందని ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చాయి. రామోజీ ఫిలిం సిటీ లో ఒక ప్రాంతంలో షూటింగ్ చేయడానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారని అయితే అనూహ్యంగా వెనకడుగు వేశారని ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం చూస్తే ఈ సినిమాను ఈ ఏడాది షూటింగ్ చేసే అవకాశం లేకపోవచ్చు అని భావిస్తున్నారు. కరోనా వైరస్ తగ్గిన తర్వాత మాత్రమే సినిమా షూటింగ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వాస్తవానికి సినిమాను దసరా తర్వాత నుంచి మొదలు పెట్టాలని భావించినా కరోనా రెండో వేవ్ మొదలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.

దీనితో చిత్ర యూనిట్ వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఒక కీలక ప్రకటన కూడా వెలువడే అవకాశాలు ఉండవచ్చు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సినిమా మాత్రం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు నటిస్తారు ఏంటి అనే విషయం మాత్రం ఎలాంటి స్పష్టత రావడం లేదు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రాధిక ఆప్టే ని ఎంపిక చేసే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడే సూచనలు కనబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: