బిగ్ బాస్ సీజన్ 4లో స్ట్రాంగ్ ప్లేయర్ గా మొదటి నుండి ఉన్న అఖిల్ తన ఆట తీరుని మార్చేస్తున్నట్టు తెలుస్తుంది. ఫిజికల్ గా స్ట్రాంగ్ అయినా కూడా మోనాల్ తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ అసలు ఆటని మర్చిపోయిన అఖిల్ ఈ వారం తన గేమ్ ప్లాన్ మార్చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మోనాల్ ను ఈ వారం మొదట్లోనే నామినేట్ చేసిన అఖిల్ ఆ తర్వాత అభిజిత్ తో కూడా మాట్లాడుతున్నాడు.

మొదటి రెండు వారాలు అభిజిత్, అఖిల్ ఇద్దరు మాట్లాడుకున్నారు కాని ఎప్పుడైతే మోనాల్ ఇద్దరి మధ్యలోకి ఎంటర్ అయ్యిందో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ప్రతి వారం నామినేషన్స్ టైం లో వారి మధ్య గొడవ జరిగేది కాని ఇప్పుడు గేమ్ ప్లాన్ మారుతుంది. అఖిల్, అభిజిత్ దగ్గరవుతున్నారు. అదే విషయమై మోనాల్ కూడా అఖిల్ ను అడిగితే మా మధ్య ఉన్న చిన్న గొడవలు సార్ట్ అవుట్ చేసుకున్నామని అతనితో నేను మాట్లాడటానికి ఎలాంటి ఇబ్బంది లేదని అన్నాడు.

అభిజిత్ తో అఖిల్ మాట్లాడే విషయమై మోనాల్ షాక్ లో ఉంది. ఎందుకంటే అభిజిత్ ఆమెను దూరం పెట్టాడు. ఆమెతో మాట్లాడటం కూడా లేదు. అభిజిత్, అఖిల్ ఇద్దరు కలిసి ఆటాడితే ఆ లెక్క వేరేలా ఉంటుంది. హౌజ్ లో ఉన్న ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టంట్స్ కలిసి ఆడితే ఆట రసవత్తరంగా ఉంటుంది. మొన్న కుమార్ సాయి వెళ్లేప్పుడు అతను చెప్పిన కరివేపాకు కామెంట్ కు హర్ట్ అయిన అఖిల్ ఇప్పుడు ఆట మీద పూర్తిగా దృష్టి పెడుతున్నాడని చెప్పొచ్చు.                                                 

మరింత సమాచారం తెలుసుకోండి: