ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళితో ఆర్ఆర్ఆర్ చేస్తున్నారు. ఆ తర్వాత కూడా పాన్ ఇండియా మార్కెట్ ఉన్న సినిమానే కావాలనుకుంటున్నారు ఎన్టీఆర్. అయితే త్రివిక్రమ్ మాత్రం తారక్ కోసం ఓ మాంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను రెడీ చేశారు. ఆర్ఆర్ఆ తర్వాత ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా కథ విషయంలోనే తిరకాసు మొదలైంది. మొదట్లో కథకు ఓకే చెప్పిన ఎన్టీఆర్.. రాను రాను సినిమా విషయంలో త్రివిక్రమ్ కు సలహాలు ఎక్కువగా చెబుతున్నారట. పాన్ ఇండియా సబ్జెక్ట్ లాగా దాన్ని రీరైట్ చేయాలని అంటున్నారట.
ఇన్నాళ్లూ కుటుంబ కథా చిత్రాలతో కమర్షియల్ అంశాలతో దర్శకుడు త్రివిక్రమ్ కాలక్షేపం చేస్తూ వచ్చాడు. అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తోన్న సినిమాపై త్రివిక్రమ్ మీద ఈసారి ఎక్స్ట్రా ప్రెజర్ ఉంటుంది. అందుకే త్రివిక్రమ్ ఈసారి తన జోన్ వదిలి బయటకు రాక తప్పేలా లేదు. నిజానికి త్రివిక్రమ్ గతంలో మంచి ఐడియాలతో యాక్షన్ ప్రధాన సినిమాలు చేస్తుండేవాడు. అత్తారింటికి దారేది తర్వాత త్రివిక్రమ్ కథలు ఒక ఇంటికి, రెండు కుటుంబాలకు పరిమితం అవుతూ వస్తున్నాయి. ఎన్టీఆర్ ఇమేజ్ని దృష్టిలో వుంచుకుని త్రివిక్రమ్ మళ్లీ యాక్షన్ మోడ్లోకి వస్తాడేమో చూడాలి. ఎన్టీఆర్ మాట విని పూర్తిగా కథను రీరైట్ చేస్తారా లేక తన ఎలిమెంట్స్ తోటే పాన్ ఇండియా స్థాయి సినిమా తీస్తాడా అనేది చూడాలి.