మెగా స్టార్ చిరంజీవి ఇప్పడు కొరటాల డైరెక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్నాడు. సైరా తరువాత చేస్తున్న సినిమా కావడంతో పాటు కొరటాల చాలా గ్యాప్ కూడా తీసుకుని చేస్తున్నారు. ఇక ఈ రోజు దసరా సందర్భంగా ఈటీవీ మెగా ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇవ్వడానికి రెడీ అయింది. ఈ టీవీ సినిమా చానల్ లో 10:00 AM - చంటబ్బాయి, 1:00 PM  - అడవి దొంగ, 4:00 PM  - మగమహారాజు, 7:00 PM   - కొదమ సింహం సినిమాలు చేస్తున్నాడు. ఇక ఆచార్య విషయానికి వస్తే ఈ సినిమా కోసం కొరటాల శివ క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. ఆచార్య మూవీలో చిరంజీవి, రామ్ చరణ్ లను ఇద్దరినీ చూపించడానికి ఆయన ప్లాన్ చేశారు.

ఇప్పటి దాకా చిరంజీవి, రామ్ చరణ్ లు రెండు మూడు సినిమాల్లో కలిసి కనిపించినా అవి కేవలం అతిధి పాత్రలు మాత్రమే. మగధీర, బ్రూస్ లీ లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు చిరు. ఫ్యాన్స్ కోరికను కన్సిడర్ చేశారో ? లేక మరేమైనా కారణాలు ఉన్నాయో తెలీదు కానీ కొరటాల ఓ పూర్తి స్థాయి పాత్రను చరణ్ కోసం ఆచార్యలో డిజైన్ చేశారు. దాదాపు అరగంట నిడివి ఉన్న పూర్తి స్తాయి పాత్ర కోసం చరణ్ ని కొరటాల అనుకున్నారు.

అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుండే ఎందుకో బాగా లేటయిందని చెప్పచ్చు. అందుకేనేమో ఇది పూర్తి అవగానే వెంట వెంటనే సినిమాలు చేయడానికి ఇప్పటి నుండే వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు చిరంజీవి. ఇక చిరంజీవి ఆచార్య షూటింగ్‍ ఎప్పుడు మొదలవుతుంది, దాని తర్వాత ఏ సినిమా వుంటుందనే దానిపై మీడియాలో చాలా రకాల కథనాలు వస్తున్నాయి. తాజా సమాచారం మేరకు దసరా తరువాత ఈ షూట్ లో చిరు పాల్గొననున్నాడు. ఇక ఆచార్య షూట్ ఫిబ్రవరిలో పూర్తి చేసి వేసవిలో విడుదల చేసేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.  



 

మరింత సమాచారం తెలుసుకోండి: