అవునూ.. సాయి ధరమ్ తేజ్, దేవకట్టాల కాంబినేషన్ లో వస్తున్న సినిమా టైటిల్ లీక్ అయినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆ మూవీ టైటిల్ ఇదేనంటూ ఓ టైటిల్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. అయితే ఇంతకీ ఆ టైటిల్ ఏంటి? అనే విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, టాలెంటెడ్ డైరెక్టర్ దేవకట్టా కాంబినేషన్ లో ఓ సినిమా రానున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమా టైటిల్ ఇదేనంటూ ఓ టైటిల్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ టైటిల్ ఏంటంటే.. "రిపబ్లిక్". అవునూ.. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు 'రిపబ్లిక్' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమా టైటిల్ ను దసరా సందర్భంగా నిన్ననే ప్రకటించాలని అనుకుని డిజైన్ రెడీ చేసారట. కానీ లాస్ట్ మినిట్ లో ఇంతకన్నా బెటర్ టైటిల్ వస్తుందేమో చూద్దామని ఆగిపోయారు. ప్రస్తుతానికైతే "రిపబ్లిక్" ను వర్కింగ్ టైటిల్ గా ఫిక్స్ చేసింది యూనిట్.
ఇదిలా ఉంటే..  ఈ సినిమా ఎమోషనల్ పొలిటికల్ డ్రామాగా రాబోతోంది . తన కెరీర్ లో సాయితేజ్ చేస్తున్న పొలిటికల్ బేస్డ్ మూవీ ఇదే. ఈ సినిమాకు రీరికార్డింగ్ చాలా ముఖ్యంట. అందుకే రీరికార్డింగ్ ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషలిస్ట్ ..ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనుంది. ఓ పవర్ ఫుల్ రాజకీయ నాయకురాలి పాత్రలో కనిపించనుంది. సాయి ధరమ్ తేజ్ కి, రమ్యకృష్ణ కి మద్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని సమాచారం. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. గతేడాది విడుదలైన "చిత్రలహరి", "ప్రతిరోజూ పండగే" చిత్రాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్నారు హీరో సాయిధరమ్‌ తేజ్‌. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా "సోలో బ్రతుకే సో బెటర్‌" తెరకెక్కి రిలీజ్ కు రెడీ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: