నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శివ నిర్వాణ డైరక్షన్ లో టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ జరుగుతుంది. ఇక ఈ సినిమా తర్వాత నాని టాక్సీవాలా ఫేం రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో శ్యాం సింగ రాయ్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాను డిసెంబర్ నుండి సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది.

ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తారని టాక్. ఈ సినిమా ముందు సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తారని తెలిసింది. కాని నాని తన రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేయడం వల్ల నిర్మాతలు అందుకు కాదని చెప్పడంతో సితార నుండి నిహారిక ఎంటర్టైన్మెంట్స్ కు సినిమా షిఫ్ట్ అయ్యింది. వెంకట్ బోయినపల్లి ఈ సినిమా నిర్మిస్తున్నారు.

నాని రెమ్యునరేషన్ వల్లే ఈ సినిమా చేతులు మారిందని అంటున్నా అసలు కారణం అది కాదు వేరేది ఉందని అంటున్నారు. నాని హీరోగా వచ్చిన వి సినిమా నిరాశపరచగా టక్ జగదీష్ తో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. టక్ జగదీష్ సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. శ్యాం సింగ రాయ్ కూడా డిసెంబర్ నుండి మొదలుపెట్టి 2021 సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. వి రిజల్ట్ తేడా కొట్టినా నాని మళ్లీ తన సినిమాలతో పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉన్నాడు. తప్పకుండా ఈ సినిమాల ఫలితాలు నానికి ఫుల్ జోష్ ఇచ్చేలా చేస్తాయని ఆశిద్దాం.                                                                     

మరింత సమాచారం తెలుసుకోండి: