పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు తాను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానో అనే విషయాన్నీ చెప్పారు . రాజకీయాల్లోకి రావడం వెనక ఒక సినిమా ఉందంట . అదే తాను ఎంతో ఇష్టపడి చేద్దామనుకున్న సత్యాగ్రహి అనే సినిమా.ఈ సినిమాని  ఎందుకు ఆపేశారో పవన్ కళ్యాణ్ .ఆ విషయాలు ఏంటో  చూద్దాం .

సత్యాగ్రహి సినిమా నాకు చాలా ప్రత్యేకం  ఎందుకంటే సత్యాగ్రహి ని చాలా ఏళ్ల క్రితమే సెట్స్‌పైకి తీసుకెళ్లి ఆ తర్వాత ఆపేశారట పవన్‌. దీనికి గల కారణాలను ఓ కార్యక్రమంలో బయటపెట్టారు.చాలా సంవత్సరాల క్రితమే సత్యాగ్రహిని మొదలుపెట్టాను. ఆ చిత్ర పోస్టర్‌లో ఓవైపు లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణన్, మరోవైపు చెగువేరా చిత్రాలను పెట్టాను. ఇప్పుడు నా నిజ జీవితంలో ఏం చేస్తున్నానో అదే ఆ చిత్ర కథ. సినిమాల్లో పోరాటం చేసినంత మాత్రాన బయట పనులు జరగడం కష్టం. అందుకే సినిమాలతో పోరాటం చేయడం ఇష్టం లేక రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు . ఆ సినిమా ఆపేసినప్పుడు నన్ను చాలా మంది తిట్టారు. కానీ ప్రజలతో మమేకమై వారి సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నందున దాన్ని వదులుకోక తప్పలేదు అని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు.

ఆ ఒక్క సినిమానే కాదు  ఇడియట్‌, అతడు, నేనింతే.. ఈ సినిమాలతో కూడా పవన్‌ కళ్యాణ్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎందుకంటే ఈ కథలన్నీ దర్శకులు పవన్‌ కోసం సిద్ధం చేసినవే. అయితే అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టులను పవన్ వదులుకోవాల్సి వచ్చింది. ఇలాగే పవన్‌ మరికొన్ని సినిమాలు కూడా సెట్స్‌పైకి తీసుకొద్దామని భావించి వదిలేశారత . వాటిలో సత్యాగ్రహి’ కోబలి ముఖ్యమైనవి. అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్‌ తెరకెక్కిద్దామనుకున్న ‘కోబలి’ భవిష్యత్తులో తెరకెక్కే అవకాశం ఉంది. పవన్‌తో బండ్ల గణేష్‌తో తీసే సినిమా కోబలి ప్రాజెక్టే అని ప్రచారం జరుగుతోంది.సత్యాగ్రహి మాత్రం భవిష్యత్తులోనూ పట్టాలెక్కే ఛాన్స్ ఉండబోదని స్పష్టం చేసారు ..

సత్యాగ్రహి సినిమా ద్వారా రాజకీయాల్లోకి రావాలని ఫిక్స్ అయినా పవన్ కళ్యాణ్ ఆ తర్వాత జనసేన పార్టీ ని స్థాపించిన విషయం తెలిసింది . ఈ పార్టీ ద్వారా ప్రజలకి ఎప్పుడు దగ్గరగా ఉంటూ వారి సమస్యలను వింటున్నారు .
 

మరింత సమాచారం తెలుసుకోండి: