సూపర్ స్టార్ మహేష్ పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. కరోనా లాక్ డౌన్ తర్వాత నవంబర్ నుండి షూటింగ్ అనుకున్న సినిమా కాస్త జనవరికి వాయిదా పడినట్టు తెలుస్తుంది. సినిమా మొదటి షెడ్యూల్ యూఎస్ లో ఫిక్స్ చేశాడట డైరక్టర్ పరశురాం. కరోనా వల్ల ఏడు నెలలు సినిమా వెనక్కు వెళ్లింది. అసలైతే 2021 సమ్మర్ కల్లా సినిమా రిలీజ్ చేయాలని అనుకున్న మహేష్ నెక్స్ట్ ఇయర్ సినిమా కష్టమే అనుకునేలా పరిస్థితులు ఉన్నాయి.

మహేష్ తో సినిమా అంటే మాములు విషయం కాదు.. కేవలం పూరీ జగన్నాథ్ మాత్రమే 70 రోజుల్లో మహేష్ తో సినిమా తీశాడు. పరశురాం తో మహేష్ సినిమా ఎంత స్పీడ్ గా షూటింగ్ జరుపుకున్నా వచ్చ్ ఏడాది మాత్రం రిలీజ్ కష్టమే అని అంటున్నారు. అయితే మహేష్ ఫ్యాన్స్ మాత్రం సూపర్ స్టార్ ను స్పీడ్ పెంచాలని కోరుతున్నారు. పరశురాం సినిమా తర్వాత అసలైతే రాజమౌళితో సినిమా చేయాల్సి ఉంది. మరి ఆ సినిమాకు మధ్యలో ఏదైనా సినిమా చేస్తాడా లేక డైరక్టర్ గా రాజమౌళి కోసం వెయిట్ చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.

ఏది ఏమైనా ఖలేజాకి ముందు 3 ఇయర్స్ ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయని మహేష్ ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఒక సినిమా తప్పకుండా రిలీజ్ ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. మరి సర్కారు వారి పాట జనవరిలో మొదలుపెట్టి ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేస్తే మాత్రం రికార్డ్ అవుతుందని చెప్పొచ్చు.                                                          

మరింత సమాచారం తెలుసుకోండి: