దేవి శ్రీ ప్రసాద్ కొద్దిగా వెనక్కి తగ్గడంతో ఆ గ్యాప్ లో వరుస సూపర్ హిట్లతో దూసుకెళ్తున్నాడు థమన్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాకు కెరియర్ బెస్ట్ ఆల్బం అందించిన థమన్ ఈ సినిమాతో క్రేజ్ డబుల్ చేసుకున్నాడు. అందుకే ఇప్పుడు స్టార్స్ అంతా థమన్ తో వరుస సినిమాలు చేస్తున్నారు. లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాటకు థమన్ మ్యూజిక్ మొదలు పెట్టాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు ట్యూన్స్ సిద్ధమని చెబుతున్నాడు థమన్.

అద్భుతమైన సిచువేషన్స్ ఇచ్చిన డైరక్టర్ పరశురాం కు థ్యాంక్స్ అంటూ థమన్ ట్వీట్ చేశాడు. థమన్ చెబుతున్నది చూస్తుంటే అల వైకుంఠపురములో సినిమాకు ముంచిన ఆల్బం థమన్ ఇచ్చేలా ఉన్నాడు. అంతేకాదు ఈ సినిమాతో కూడా మ్యూజిక్ తో రికార్డులు సృష్టించాలని ఫిక్స్ అయ్యాడు థమన్. అందుకే సర్కారు వారి పాటకి అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నాడట.

ఈమధ్య దేవి కొద్దిగా దూకుడు తగ్గించగా థమన్ అదరగొట్టే మ్యూజిక్ తో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాడు. తనకు ఇవ్వాల్సిన ఫ్రీడం ఇస్తే ఎలాంటి సెన్సేషనల్ ఆల్బం ఇస్తాడో థమన్ అల వైకుంఠపురములో సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. తప్పకుండా మహేష్ సినిమాకు కూడా థమన్ అంచనాలకు మించి మ్యూజి ఇస్తాడని చెప్పొచ్చు. సర్కారు వారి పాట సినిమా పరశురాం డైరక్షన్ లో మైత్రి మూవీస్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్స్ అరసన కీఎర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.                                       



మరింత సమాచారం తెలుసుకోండి: