టాలీవుడ్ లో ఇటీవలే మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో వరుస విజయాలను అందుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.ఇక ప్రస్తుతం గీత గోవిందమ్ ఫేమ్ పరశురాం డైరెక్షన్లో సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి మహేష్ పుట్టిన రోజున విడుదల చేసిన మోషన్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో మహేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమా బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో సాగుతోంది. మహేష్ ఈ సినిమాలో ఓ రోల్ లో బ్యాంక్ ఎంప్లాయిగా కనిపించబోతున్నాడు.ఇక ఈ సినిమా షూటింగ్ కరోనా వల్ల ఆగిపోయింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యుల్ ని అమెరికాలో ప్లాన్ చేసాడు దర్శకుడు.

 ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ 2021 జనవరి ఫస్ట్ వీక్ నుంచి జరగనున్నది. అత్యధిక అంచనాలు ఉన్న ఈ సినిమా షూటింగ్ నిజానికి ఈ ఏడాది వేసవిలోనే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి దెబ్బకు రెగ్యులర్ షూటింగ్ అనివార్యంగా వాయిదా పడింది. ఇప్పుడు నిర్మాతలు జనవరి నుంచి షూటింగ్ జరిపేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు.సినిమా కథలో చాలా భాగం అమెరికా నేపథ్యంలో నడుస్తుంది కాబట్టి ఎక్కువ శాతం షూటింగ్ అక్కడ జరపనున్నారు. యూనిట్‌కు సంబంధించిన వీసాల అనుమతుల కోసం నిర్మాతలు ఎదురు చూస్తున్నారు.

అవి రాగానే యు.ఎస్‌.కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్‌లోనే మహేశ్‌, హీరోయిన్ కీర్తి సురేశ్ మధ్య సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో మహేశ్ రెండు ఛాయలున్న పాత్రలో కనిపిస్తాడని సమాచారం. ఇతర భాషల్లోనూ ఏక కాలంలో విడుదల చేయాలనుకుంటున్న సినిమా కాబట్టి, బాలీవుడ్‌, సౌత్ ఇండస్ట్రీలోని ఇతర భాషలకు చెందిన ప్రముఖ నటులను ఈ సినిమా కోసం తీసుకుంటున్నారు. ఇక ఓ ప్రత్యేక పాత్రకు గాను బాలీవుడ్ నటి విద్యా బాలన్ ని ఈ సినిమాలో తీసుకుంటున్నారని సమాచారం. ఇక దీనిపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వెలువడనుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: