ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ప్రముఖ పాపులర్ ఛానల్ ఈ టీవీలో "ఢీ" విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. సుధీర్, హైపర్ ఆది, వర్షిణి, రష్మీ, ప్రదీప్కామెడీ చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఇక కన్టెంస్టెంట్ల డాన్స్ పెర్ఫార్మన్స్ అయితే చెప్పనవసరం లేదు. తమ డాన్సులతో అదరగొట్టేస్తున్నారు. రోజురోజుకి చాలా వినోదాత్మకంగా ఉత్కంఠభరితంగా ఈ షో సాగుతుంది. ఈ డాన్స్ రియాలిటీ షో కి చాలా మంది అభిమానులు వున్నారు. ఇది కాస్త సర్కస్ షోని తలపించినా కానీ ఆధ్యంతం ఎంటర్టైన్ చేసే విధంగానే సాగుతుంటుంది. ప్రతీవారం ప్రసారమయ్యే ఎపిసోడ్ కు సంబంధించి ముందుగా ప్రోమోలను విడుదల చేస్తుంటారు. తాజాగా నవంబర్ 4న ప్రసారమయ్యే క్వార్టర్ ఫైనల్స్ ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమోను కూడా విడుదల చేశారు షో నిర్వాహకులు. ఈ నేపథ్యంలో ఓ కంటెస్టెంట్ పవన్ కల్యాణ్…

‘వకీల్ సాబ్’ లోని ‘మగువా మగువా..’ పాటకు ఓ గ్రూప్ పెర్ఫామెన్స్‌ ఇచ్చాడు. దీనిని చూసిన వారంతా ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలో ప్రియమణి, రష్మి… కన్నీళ్ళు పెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రియమణి మాట్లాడుతూ.. “ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూ చూసాను. అందులో ఒకతను మాట్లాడుతూ.. ‘ఆడవాళ్లు ఎందుకు పనిచెయ్యాలి? అనే ప్రశ్న వేసాడు. అమ్మాయిలు తమ శరీరం కనిపించేలా పొట్టి పొట్టి డ్రెస్సులు ఎందుకు వేసుకోవాలి. వాళ్ళు ఇంట్లోనే ఉండొచ్చుగా’ అని చెప్పాడు.
ఆ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసిన జెంట్స్ అంతా ఇలాగే మాట్లాడారు” అంటూ చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. నవంబర్ 4న టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్లో ప్రియమణి.. మహిళల పట్ల పురుషులకు ఎటువంటి అభిప్రాయాలు ఉంటాయి అనే విషయాన్ని తెలియజేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని మూవీ విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.


మరింత సమాచారం తెలుసుకోండి: