సుకుమార్ అసిస్టెంట్ గా పనిచేసిన బుచ్చిబాబు వైష్ణవ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ ఉప్పెన సినిమా డైరెక్ట్ చేశారు. ఈ సినిమాను సుకుమార్ అంతా వెనక ఉండి నడిపించాడని టాక్. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ కలిసి నిర్మించిన ఈ సినిమా రిలీజ్ ముందే హిట్ అన్న టాక్ వచ్చింది. ఈ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్ ఇద్దరు వరుస సినిమాలతో బిజీగా మారారు. డైరక్టర్ బుచ్చిబాబుకి కూడా క్రేజీ ఆఫర్లు వస్తున్నాయట. ఉప్పెన ప్రచార చిత్రాలు చూసి సితార ఎంటర్టైన్మెంట్స్ నుండి ఆఫర్ వచ్చిందని టాక్.

బుచ్చిబాబుకి 70 లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చారని తెలుస్తుంది. అయితే సితార వారు బుచ్చిబాబు తమకు సెకండ్ సినిమా చేసి ఇవ్వాలని కోరారి. ఉప్పెన ఫేం కాబట్టి కమర్షియల్ గా కూడా వర్క్ అవుట్ అవుతుందని భావించారు. ఇక ఇదిలాఉంటే మైత్రి మూవీ మేకర్స్ కూడా నెక్స్ట్ సినిమా ఆఫర్ ఇవ్వడంతో సితారని పక్కన పెట్టి తనకు మొదటి అవకాశం ఇచ్చిన మైత్రికి సెకండ్ సినిమా చేస్తానని చెప్పాడట. అయితే సితార ప్రొడ్యూసర్స్ మాత్రం మాకు సెకండ్ సినిమానే డైరెక్ట్ చేయాలని లేకపోతే అడ్వాన్స్ ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరారట.

చేసేదేమి లేక వారు ఇచ్చిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేశాడట. ఫైనల్ గా బుచ్చిబాబు ఫాం అలా కొనసాగుతుంది. అయితే సితారతో ఆఫర్ వద్దనుకున్నా మైత్రి మూవీ మేకర్స్ కచ్చితంగా బుచ్చిబాబుతో వరుస సినిమాలు చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. మరి ఈ కాంబోలో వచ్చే సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి.                                                        

మరింత సమాచారం తెలుసుకోండి: