గబ్బర్ సింగ్ సినిమా టైమ్ లో హీరోయిన్ శృతిహాసన్ కి పెద్దగా హిట్లు లేకపోయినా ఏరికోరి ఆమెకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు పవన్ కల్యాణ్. గబ్బర్ సింగ్ తర్వాతే తెలుగులో శృతి హాసన్ కి హీరోయిన్ గా మంచి పేరొచ్చింది. ఐరన్ లెగ్ అనే ముద్రపోయి.. ఆమెకు అందరూ అవకాశాలిచ్చారు. దీంతో శృతి, పవన్ కల్యాణ్ ని బాగా అభిమానించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో కాటమరాయుడు సినిమా వచ్చినా అది హిట్ కాలేదు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మరో రీమేక్ సినిమాలో పవన్ కల్యాణ్ తో కలసి నటిస్తోంది శృతి.

అయితే మూడో సినిమా వకీల్ సాబ్ విషయంలో పవన్ కల్యాణ్, శృతి హాసన్ ని ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తోంది. వకీల్ సాబ్ షూటింగ్ వల్ల శృతి ఇబ్బంది పడుతోందట. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే షూటింగ్ షెడ్యూల్స్ లో పలు మార్పులు చేర్పులు జరిగాయి. దీనికి ఎవరూ కారణం కాదు కాబట్టి.. అందరూ అడ్జస్ట్ అయిపోయారు. అయితే ఆ తర్వాత మాత్రం పవన్ కారణంగా పలుదఫాలు షూటింగ్ వాయిదా పడింది. ఇటీవల వకీల్ సాబ్ తిరిగి ప్రారంభం కావడంతో శృతి హాసన్.. డిసెంబర్ మొదటివారంలో షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. ఐతే డిసెంబర్ దాకా ఆగడం ఎందుకు ఈ నెలలోనే షూటింగ్ పూర్తి చేద్దాం, శృతి కాల్షీట్లు కూడా తీసుకోండని నిర్మాతకు చెప్పారట పవన్ కల్యాణ్. అంతా బాగానే ఉంది, చేతిలో సినిమాలేవీ లేకపోవడంతో శృతి కూడా వకీల్ సాబ్ కి నవంబర్ లోనే కాల్షీట్లిచ్చింది. తీరా ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల వల్ల వకీల్ సాబ్ ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో షూటింగ్ డిసెంబర్ కి పోస్ట్ పోన్ అవుతుందని అంటున్నారు.

గ్రేటర్ ఎన్నికల్లో జనసేన బరిలోనుంచి తప్పుకున్నా.. బీజేపీ తరపున ప్రచారం చేయాల్సిన బాధ్యత పవన్ పై ఉంది. ఇప్పటికే పవన్ ని టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ నేతలు కౌంటర్లు ఇస్తున్న సందర్భంలో ఆయన సైలెంట్ గా ఉండటం కుదరదు. అందుకే పవన్ కూడా పాలిటిక్స్ తో బిజీగా మారబోతున్నారు. దీంతో వకీల్ సాబ్ అనుకోకుండా డిసెంబర్ కి వాయిదా పడింది. శృతిహాసన్ తాజాగా ఇచ్చిన డేట్స్ క్యాన్సిల్ చేసి, డిసెంబర్లో కాల్షీట్లు ఇవ్వాల్సి వచ్చింది. ఇలా పవన్ రాజకీయాలతో శృతి హాసన్ ఇబ్బంది పడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: