టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ లో ఒకటి మహేష్ బాబు సర్కారు వారి పాట. నిజానికి మహేష్ బాబు ఈ ఏడాది మొదట్లో సరిలేరు నీకెవ్వరు అనే సినిమా హిట్ కొట్టాడు. ఈ సినిమా పూర్తయ్యాక వంశీ పైడిపల్లి తో ఓ సినిమా చేయాల్సి ఉంది కానీ అనుకోని కారణాలతో పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఆ అంచనాలను మరింత పెంచే చేశాడు పూరీ జగన్నాథ్.

 విషయం ఏంటంటే  నిన్న సర్కారు వారి పాట సినిమా పూజా కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని దర్శకుడు పరశురామ్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు, అయితే ఈ సోషల్ మీడియాలో షేర్ చేసిన దాన్ని పూరి జగన్నాథ్ షేర్ చేస్తూ మహేష్ ఫాన్స్ కి పండగే అని చాలా రోజుల పరశురామ్ కల నెరవేరుతుందని ఆయన పేర్కొన్నాడు. అంతేకాదు తాను ముంబైలో చిక్కుకుపోయాను కాబట్టి రాలేకపోతున్నానని లేకపోతే కచ్చితంగా వచ్చి ఉండేవాడిని అని పేర్కొన్నాడు. 

నిజానికి పరశురాం పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ప్రారంభించారు.  ఇద్దరిదీ ఒకే ఊరు కావడం అలాగే దగ్గర బంధుత్వం కూడా ఉండడంతో వీరిద్దరి మధ్య మంచి ర్యాపో ఉంది. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ చేసిన సదరు పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మహేష్ బాబు తో పూరి జగన్నాథ్ కూడా ఒక సినిమా చేస్తారని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యకాలంలో మహేష్ బాబు కథ చెప్పాడని త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుంది అని కూడా ప్రచారాలు జరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: