సౌత్‌ లో స్టార్ హీరోయిన్‌ గా వెలుగొందుతోన్న అనుష్క నటించిన సూపర్‌ హిట్ లేడీ ఓరియంటెడ్ సినిమా భాగమతి. బాహుబలి తర్వాత అనుష్క నటించిన ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ కాగా, ఈ సినిమా ఆమె కెరీర్‌ లో మెమరబుల్‌ సినిమాగా నిలిచిపోయింది. ఆ సినిమాలో ఆమె వాడిన డైలాగ్స్ ఇప్పటికీ వాడుతూ ఉంటారు. ఎవడు పడితే వాడు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువుల దొడ్డా.. భాగమతి అడ్డా అంటూ అనుష్క చెప్పిన డైలాగ్‌ అప్పట్లో బాగా వైరల్‌ అయ్యింది.

ఇక ఈ సినిమాని బాలీవుడ్‌ లో రీమేక్‌ చేస్తున్నారు. తెలుగులో అనుష్క చేసిన పాత్రను అదే స్థాయిలో నటించే నటి కోసం చాలా మందిని ఫిల్టర్ చేసి లస్ట్ స్టోరీస్ లో ఫేం తెచ్చుకున్న భూమి ఫడ్నేకర్‌ ని ఎంపిక చేసి ఎట్టకేలకు సినిమా పూర్తీ చేసారు. అయితే కరోనా దెబ్బకు ఈ సినిమా కూడా అన్ని సినిమాల్లాగే ఆగింది.

కానీ షూటింగ్ కి పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో షూట్ చేసి విడుదలకు సిద్దం చేశారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌, టీ సిరీస్‌ సంస్థతో కలిసి నిర్మించిన ఈ సినిమాని దుర్గావతి అనే టైటిల్‌ తో రిలీజ్ చేస్తున్నారు. బాలీవుడ్‌ లో కూడా ఈ సినిమాను తెలుగులో తెరకెక్కించిన అశోక్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  వచ్చే నెల 11 న ఈ సినిమా ఆమెజాన్ ప్రైంలో రిలీజ్ కానుంది. నిన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ లక్ ఆకట్టుకుంటోంది. చూడాలి ఈ సినిమా ఏమేరకు ఆకట్టుకుంటుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి: