రన్ రాజా రన్ సినిమాతో డైరక్టర్ గా తన సత్తా చాటిన సుజిత్ తన సెకండ్ మూవీనే ప్రభాస్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు. బాహుబలి తర్వాత స్టార్ డైరక్టర్స్ నుండి ఆఫర్లు వచ్చినా సుజిత్ తో సాహో సినిమా చేశాడు ప్రభాస్. అయితే సాహో బాలీవుడ్ ఆడియెన్స్ కు నచ్చినా మన ప్రేక్షకులు మాత్రం పెదవివిరిచారు. డైరక్టర్ సుజిత్ టేకింగ్ పరంగా ఓకే కాని కథ ఇంకాస్త బాగా రాసుకుని ఉండాల్సిందని అన్నారు.

ఇదిలాఉంటే సాహో తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న సుజిత్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ వచ్చిందని అన్నారు. కాని ఆ రీమేక్ బాధ్యతల నుండి సుజిత్ తప్పుకున్నాడు. కారణాలు ఏంటన్నది తెలియదు కాని సుజిత్ చిరు ఆఫర్ వదులుకోవాల్సి వచ్చింది. అయితే సుజిత్ కు మరళ యువి క్రియేషన్స్ వారే అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తుంది. తన మొదటి సినిమా హీరో శర్వానంద్ తోనే సుజిత్ థర్డ్ మూవీ ఉంటుందని అంటున్నారు.

రన్ రాజా రన్ సినిమా సూపర్ హిట్ కాగా మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతుంది. మరి సాహోతో నిరాశపరచడంతో సుజిత్ ఈ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడట ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ అవగా త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. సుజిత్ చేసిన రెండు సినిమాలు యువి బ్యానర్ లోనే రాగా ఈ మూడవ సినిమా కూడా వారికే చేస్తున్నాడు.                                                                               

మరింత సమాచారం తెలుసుకోండి: