ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...టాలీవుడ్ లో ఎప్పట్నుంచో సినిమాలు చేస్తున్న నటుడు శర్వానంద్. మంచి మంచి సినిమాలు చేసుకుంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. కాని స్టార్ హీరోగా గుర్తింపు రాలేదు. ఇప్పుడు ఈ యంగ్ హీరో వరుసపెట్టి సినిమాలను అంగీకరించడమే కాదు.. వాటిని చాలా ఫాస్ట్ గా పూర్తి చేసేస్తున్నారు. ప్రస్తుతం శర్వానంద్ చేతిలో ఉన్న నాలుగు సినిమాల్లో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌లో చేస్తోన్న సినిమా ఒకటి. ‘ఖైదీ’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన ఎస్.ఆర్. ప్రభు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాతో  శ్రీ కార్తీక్  దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.


తరుణ్ భాస్కర్ ఈ సినిమాకి మాటలు రాశాడు. ఇంకా టైటిల్ ఫైనల్  చేయని ఈ సినిమాను ప్రస్తుతం ‘శర్వా 30’ అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్నారు. ఎందుకంటే ఇది శర్వానంద్ 30వ సినిమా.ఈ సినిమాలో శర్వానంద్ సరసన తెలుగమ్మాయి రీతూ వర్మ హీరోయిన్‌గా నటించింది. అలాగే వెన్నెల కిశోర్, ప్రియదర్శి సపోర్టింగ్ రోల్స్ చేశారు. సీనియర్ నటి అక్కినేని అమల ఒక ముఖ్య పాత్ర పోషించారు. కొవిడ్-19 లాక్‌డౌన్ తరవాత ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ తాజాగా పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. శర్వానంద్ సైతం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.


ఈ సినిమాతో పాటు  శర్వానంద్ ఇంకా మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. వాటిలో ‘శ్రీకారం’ షూటింగ్ చివరి దశలో ఉంది. కిశోర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక "ఆర్ ఎక్స్ 100" దర్శకుడు  అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ చేస్తున్న చిత్రం ‘మహా సముద్రం’ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్, అను ఇమ్మానుయేల్, అదితిరావు హైదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే, శర్వా చేతిలో ఉన్న మరో సినిమా ‘ఆడాళ్ళూ మీకు జోహార్లు’.


రష్మిక మందన హీరోయిన్. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు.ఖచ్చితంగా శర్వానంద్ ఈ సినిమాలతో గొప్ప హీరో అవ్వడం ఖాయమని చాలా నమ్మకంగా వున్నాడట. ఇక శర్వానంద్ నమ్మకం ఫలించాలని కోరుకుందాం. ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో మూవీ విశేషాలు తెలుసుకోండి...


మరింత సమాచారం తెలుసుకోండి: