2007లో వచ్చిన ఢీ సినిమా మంచు విష్ణుకి మొదటి కమర్షియల్ హిట్ ఇచ్చింది. శ్రీను వైట్ల డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమాలో విష్ణు సరసన జెనిలియా హీరోయిన్ గా నటించింది. ఇక లేటెస్ట్ గా శ్రీను వైట్ల, మంచు విష్ణు కలిసి మరోసారి సినిమా చేస్తున్నారు. డీ అండ్ డీ అంటూ ఈ కాంబో రిపీట్ అవుతుంది. ఈ సినిమాను మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నారు.

డీ అండ్ డీ డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ తో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్స్ గా అను ఇమ్మాన్యుయెల్, ప్రగ్యా జైశ్వాల్ పేర్లు వినపడుతున్నాయి. సినిమాలో ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉంటారా లేక ఇద్దరిలో ఒకరు ఉంటారా అన్నది తెలియాల్సి ఉంది. అజ్ఞాతవాసి, శైలజా రెడ్డి అల్లుడు తర్వాత అడ్రెస్ లేకుండాపోయింది అను ఇమ్మాన్యుయెల్. అమ్మడు ఓ మంచి ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది.

ఇక ప్రగ్యా జైశ్వాల్ కూడా కంచెతో క్రేజ్ తెచ్చుకున్నా ఆ తర్వాత సినిమాలతో అలరించలేదు. గ్లామర్ షోకి రెడీ అని ఫోటో షూట్స్ తో హింట్ ఇస్తున్నా సరే అమ్మడికి అవకాశాలు రావట్లేదు. డీ అండ్ డీ సినిమాలో ఈ ఇద్దరిలో ఒకరికి హీరోయిన్ గా ఛాన్స్ వస్తుందని తెలుస్తుంది. అయితే రాక రాక వచ్చిన ఛాన్స్ కాబట్టి ఇద్దరిలో ఎవరికి వచ్చినా సరే రెచ్చిపోవడం ఖాయమని తెలుస్తుంది.                                                                                            

మరింత సమాచారం తెలుసుకోండి: