ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...కోవిడ్ 19 ప్రభావం వలన థియేటర్ లు మూత పడిన సంగతి తెలిసిందే... ఇప్పుడు కొంచెం పరిస్థితి సద్దుమణిగాక మూతపడ్డ థియేటర్లను తెరుచుకోవచ్చని ప్రభుత్వo  అనుమతులు కూడా జారీ చేసింది. కాని జనాలు ఇంకా భయంతో రిస్క్ ఎందుకని ఆ కారణంతో థియేటర్ లకి రావటం పూర్తిగా మానేశారు. ఇక ఈ జనాలు  థియేటర్లకు రావట్లేదని చేసేదిలేక ఇక నిర్మాతలు ఓటిటి బాట పట్టారు. ఇప్పటికీ నిర్మాతలు  ఓటీటీ ప్లాట్ ఫామ్ లనే  నమ్ముకుంటున్నారు. పైగా ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు ఎక్కువ మొత్తాన్ని ఆఫర్ చేస్తుండడంతో నిర్మాతలు కూడా ఓటీటీలకే సినిమాలను అమ్మడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే కొన్ని మీడియం, లో బడ్జెట్ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. మంచి విజయం కూడా సాధించాయి. అందుకే నిర్మాతలెవరూ కూడా థియేటర్లపై దృష్టి పెట్టడం లేదు.
ఇక అసలు విషయానికి వస్తే... ఇప్పుడున్న పరిస్థితిలో ఏ హీరో కూడా థియేటర్ లో సినిమా రిలీజ్ చేసేందుకు ముందుకు రావడం లేదు. హీరోలే వెనకాడుతోన్న సమయంలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ఒకటి థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ  కియారా అద్వానీ ప్రధాన పాత్రలో నటించిన ‘ఇందు కీ జవానీ’ సినిమాను డిసెంబర్ 11న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. మరి కియారా సినిమాను చూడడానికి ప్రేక్షకులు ఏ స్థాయిలో వస్తారో తెలియదు.యాభై శాతం అమ్మకంతో బిజినెస్ ఎలా జరుగుతుందనేది తెలుసుకోవడానికి ఈ సినిమా కొంతవరకు హెల్ప్ చేస్తుంది.


ఇక ఈ సినిమా రిలీజ్ రోజున అమెజాన్ లో ‘దుర్గామతి’ అనే మరో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా రిలీజ్ కానుంది. తెలుగులో అనుష్క నటించిన ‘భాగమతి’ సినిమాకి రీమేక్ అయిన ఈ సినిమాలో భూమి పెడ్నేకర్ హీరోయిన్ గా నటించింది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: