సినిమా కోసం చాలా మంది హీరోలు బరువు తగ్గడం మనం చూస్తూనే ఉన్నాం. అదే కోవలో కమెడియన్ సునీల్ సైతం చేరి సిక్స్ ప్యాక్ సంపాదించుకున్నాడు. కానీ లాక్ డౌన్ సమయంలో తిని కూర్చోవడం కారణం గా మూడు నెలల పాటు బాగా తిండి తిని మల్లి బరువు పెరిగాడు సునీల్.



దీంతో మునపటి రూపం కోసం మల్లి తహతహలాడాడు. జిమ్ లో ఎన్ని గంటలు వర్క్ అవుట్ చేసిన ఫలితం కనిపించకపోవడంతో ప్రకృతి ఆశ్రమంలో చేరాడు సునీల్. ఊహించని విదంగా కేవలం తొమ్మిది రోజుల్లో ఏడున్నర కిలోల బరువు తగ్గి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.



9 రోజుల ప్రయాణం సాగింది ఇలా 1996 నుండి సునీల్ ప్రకృతి వైద్యాన్ని నమ్ముకున్నాడట. కానీ సినిమాల్లో బిజీ గా ఉండటంతో మధ్యలో వదిలేసాడు. లావు తగ్గాలని శతవిధాలా ప్రయత్నించినా వీలవ్వకపోవడంతో ప్రకృతి చికిత్స మీద ఆధారపడ్డాడు సునీల్. మొదటగా ప్రకృతి ఆశ్రమానికి వెళ్ళడానికి భయపడ్డ, దైర్యం చేసి జాయిన్ అయ్యాడు. వచ్చిన మొదటి రోజే ఉపవాసం గురించి తెలుసుకున్న సునీల్ అక్కడ ఒక్కరోజు కూడా ఉండలేను అనుకున్నాడట. కానీ మెతుకు తిండి తినకుండా 9 రోజుల పాటు కేవలం మంచి నీళ్లు, మూడు చుక్కల తేనే మాత్రమే తాగి అనుకున్నదాని కంటే ఎక్కువ బరువు తగ్గాడట సునీల్.


 ఈ ఫుడ్ ఎంత తీసుకున్న ఫ్యాట్ బాడీ లో చేరదని, ఆకలేసినప్పుడు మూడు చుక్కల తేనె, నిమ్మచెక్కతో కలిపి తీసుకుంటే కావాల్సినంత ఎనర్జీ లభిస్తుందని సునీల్ తెలిపారు. చేపలు, నాన్ వెజ్ వంటి మాంసాహారం తీసుకున్నప్పటికీ కంటే ఎంతో ఎనర్జిటిక్ గా అనిపిస్తుందని అయన తెలిపారు. ఎంతో తిన్న స్థితిని చూసా అని, అలాగే ఏమి తినకుండా ఉన్న పరిస్థితిని కూడా తట్టుకున్న అని సునీల్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: