రంగస్థలం సినిమాతోమంచి విజయాన్ని సొంతం చేసుకుని.. దర్శకుడిగా మరోసారి తన సత్తా చాటాడు సుకుమార్. ఇండ్రస్టీ లో సుకుమార్ తీసిన సినిమాల సంఖ్య తక్కువే అయినా.. ఆ సినిమాల్లో దాదాపు అన్ని సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించినవే. ఇక ప్రస్తుతం సుకుమార్ మొట్టమొదటి సారిగా పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప'. తెలుగుతో పాటు నాలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. గందపు చెట్ల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ ఓ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక బన్నీ సరసన రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి విలన్ గా ఎంతో మంది పేర్లు వినిపించాయి.

 కానీ ఇప్పటికీ వాటిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు దర్శకుడు. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విక్రమ్..బన్నీ కి  విలన్‌గా నటించనున్నాడంటూ ఇటీవల ఆన్‌లైన్‌లో విరివిగా ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన 'పుష్ప'లో భాగం కావట్లేదని తెలిసింది. మొదట డేట్స్ సమస్య కారణంగా విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్ నుంచి అధికారికంగా తప్పుకున్నాడు. దాంతో చియాన్ విక్రమ్‌ను సుకుమార్ సంప్రదించి, ఆయనకు కథ వినిపించాడనీ, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ స్పెక్యులేషన్ జరిగింది.విక్రమ్ అయితే ఆ క్యారెక్టర్‌కు న్యాయం జరుగుతుందని బన్నీ కూడా భావించడానీ, ఆయన వస్తే ప్రాజెక్టుకు మరింత ప్రయోజనం చేకూరుతుందని అనుకున్నాడనీ చెప్పుకున్నారు.

అయితే విక్రమ్ సన్నిహిత వర్గాలు ఈ ప్రచారాన్ని తోసిపుచ్చాయి. అవన్నీ కేవలం వదంతులనీ, 'పుష్ప'లో విలన్‌గా విక్రమ్ నటించట్లేదనీ ఆ వర్గాలు స్పష్టం చేశాయి.ఈ ఏడాది మార్చిలో సెట్స్ మీదకు వెళ్లాల్సిన ఈ సినిమా కరోనా దెబ్బకు ఆగిపోయింది. ఇటీవల నవంబర్ 12న తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ ప్రారంభించారు. బన్నీ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా అతని లుక్ అనధికారికంగా బయటకు వచ్చి..ఎంతో వైరల్ అయ్యింది. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: