అందుకు తగ్గట్లే కెజిఎఫ్ సినిమా దేశమంతా పెద్ద హిట్ అయ్యింది.. అప్పటివరకు కన్నడ వరకే పరిమితమయ్యింది యష్ ఈ సినిమా తో ప్రభాస్ లాగే దేశమంతటా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ పై అంచనాలు డబుల్ అయ్యాయి.. పైగా ఈ సినిమా లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తుండడంతో మొదటి పార్ట్ కంటే ఎక్కువగా ప్రేక్షకులు సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నారు..
ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడానికి ముఖ్య కారణం మాత్రం దర్శకుడు ప్రశాంత్ నీల్ అని చెప్పాలి.. అందుకే ఆయనకోసం అందరు హీరోలు ఎగబడుతున్నారు.. ఈ నేపథ్యంలో అయన ఎన్టీఆర్ తో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నారని ప్రచారం జరుగుతుండగా ఆ సినిమా లైన్ కూడా ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది.ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ పీరియాడిక్ డ్రామాను తెరకెక్కించబోతున్నాడట. ఇండియా పాకిస్తాన్ విడిపోయిన సమయంలో జరిగిన సంఘటనలు మరియు ఇండో పాక్ యుద్దం వంటి పరిణామాలను ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడట. స్టోరీ లైన్ ఇప్పటికే సిద్దం అయ్యింది. స్క్రిప్ట్ వర్క్ ను ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 విడుదల తర్వాత మొదలు పెట్టే అవకాశం ఉందంటున్నారు.