నందమూరి సింహాలు బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్లను ఒకేసారి వెండితెరపై చూడాలని నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ ఇప్పటికే ‘యన్.టి.ఆర్’ సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ బోయపాటి సినిమాలో కలిసి నటించబోతున్నారని రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ అతిథి పాత్ర చేయబోతున్నాడని టాక్ నడుస్తుంది.ఇంటర్వెల్ బ్లాక్లో కళ్యాణ్ రామ్ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు.
ఇందులో కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారట. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వస్తే కానీ స్పష్టత రాదు.ఇదిలా ఉంటే, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నట్టు సమాచారం. బాలయ్య కూడా ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారట. పూర్ణ, సయేషా హీరోయిన్లుగా నటిస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. వీరు ముగ్గురూ ప్రస్తుత షెడ్యూల్లో పాల్గొంటున్నారని టాక్. కాగా, ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇంకా ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో మూవీ విశేషాలు తెలుసుకోండి...