కథ రెడీ అయి ఆరు నెలలు దాటింది. బౌండెడ్ స్క్రీన్ప్లేను రెడీ చేసి నాలుగు నెలలైంది. కానీ.. ఎన్టీఆర్మాత్రం డేట్స్ ఇవ్వలేదు. ఆర్ఆర్ఆర్ పూర్తయితేగానీ.. త్రివిక్రమ్ సినిమాలో జాయిన్ కాడు. జనవరినాటికి ఆర్ఆర్ఆర్లో తన పాత్రను పూర్తిచేసి.. మార్చి నుంచి త్రివిక్రమ్ మూవీలో జాయిన్ అవుతున్నాడు తారక్. ఈ కాంబినేషన్ ఫిక్స్ అయి ఏడాది కావస్తున్నా.. హీరోయిన్ మాత్రం సెలెక్ట్ కాలేదు. ముందుగా... రష్మిక.. పూజా హెగ్డే పేర్లు వినిపించాయి. ఇప్పటికే త్రివిక్రమ్ వరుస సినిమాలు అల వైకుంఠపురంలో.. అరవింద సమేత వీర రాఘవలో పూజా హెగ్డే కావడంతో.. రొటీన్ అయిపోతుందన్న ఫీలింగ్తో ఈ అమ్మడికి స్పేస్ ఇవ్వలేదు దర్శకుడు.
ఎన్టీఆర్కు సరిజోడీని నెలలు తరబడి వెతుకుతున్నా.. ఎవరూ సెట్ కావడం లేదు. ఆ మధ్య రష్మిక మందాన్నా పేరు వినిపించింది. అయితే.. షూటింగ్ లేటవడంతో.. రష్మిక వేరే సినిమాలకు కమిట్ అయింది. దీంతో.. మరోసారి హీరోయిన్ని వెతికేపనిలో పడ్డాడు త్రివిక్రమ్.
ఎన్టీఆర్కు జోడీగా కొత్తగా వినిపిస్తున్న పేరు కియారా అద్వానీ. దర్శకుడు ఆల్రెడీ కథతో ఆమెను ఒప్పించినట్టు తెలిసింది. ఒకవేళ ఫిక్స్ అయితే.. ఎన్టీఆర్.. త్రివిక్రమ్తో కియారాకు ఇదే ఫస్ట్ మూవీ అవుతుంది. కియారా తెలుగులోకి అడుగుపెడుతూనే.. 'భరత్ అనే నేను'తో హిట్ కొట్టింది. రెండో సినిమా వినయ విధేయ రామ్ ప్లాప్కావడం.. ఇంతలో హిందీలో బిజీ ఆఫర్స్తో టాలీవుడ్ వైపు చూడలేదు. ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ మరోసారి తెలుగులోకి తీసుకొస్తున్నాడు. మొత్తానికి ఎన్టీఆర్.. త్రివిక్రమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.