ప్రశాంత్ నీల్.. ఇప్పుడు దేశంలో ఎవరినోట విన్న ఈ పేరే.. కేజిఎఫ్ తో సంచలనం సృష్టించిన ఈ దర్శకుడు పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది.. టాలీవుడ్ నుంచి వచ్చిన బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. పలు భాషల్లో విడుదల అయిన ఈ సినిమా ని దేశంఅంతటా ప్రజలు ఆదరించారు.. ఈ సినిమా తర్వాత దేశమంతటా పేరు సంపాదించుకున్న సినిమా కేజీఎఫ్.. కన్నడ నుంచి ఎలాంటి  అంచనాలు లేకుండా వచ్చిఒక్కసారిగా దేశాన్ని ఊపేసింది అని చెప్పొచ్చు.. బాలీవుడ్ జనాలు అయితే ఈ సినిమా ను తెగ ఆదరించారు..

సినిమా తో యష్ కూడా ప్రభాస్ లాగే దేశమంతటా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ పై అంచనాలు డబుల్ అయ్యాయి.. పైగా ఈ సినిమా లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తుండడంతో మొదటి పార్ట్ కంటే ఎక్కువగా ప్రేక్షకులు సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నారు.. ఇక ప్రశాంత్ నీల్ రెండో సినిమా గా ప్రభాస్ తో సలార్ అనే సినిమా ని ప్రకటించిన సంగతి తెలిసిందే..

 'కేజీఎఫ్' దర్శకుడితో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సినిమా అనౌన్స్ చేయడం పట్ల డార్లింగ్ ఫ్యాన్స్ మరియు టాలీవుడ్ సినీ అభిమానులు ఫుల్ ఖుషీ గా ఉన్నారు. కానీ కన్నడ సినీ అభిమానులు ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న 'సలార్' పై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.'కేజీఎఫ్' దర్శకుడు కన్నడ పరిశ్రమకు చెందిన హీరోలతో కాకుండా బయట ఇండస్ట్రీ హీరోతో మూవీ చేయడం అక్కడి వారికి నచ్చడం లేదని తెలుస్తోంది. 'కేజీఎఫ్' దర్శక నిర్మాతలు శాండిల్ వుడ్ అభివృద్ధికి కాకుండా పక్క ఇండస్ట్రీల కోసం వర్క్ చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: