ఇక రామ్ చరణ్ సరసన ముందుగా బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వాని ని సంప్రదించగా.. ఈ హాట్ బ్యూటీ కి డేట్స్ ఏమి ఖాళీ లేవట.అందువల్ల చెయ్యలేకపోయింది. దీంతో చాలామందిని పరిశీలించిన తరువాత చివరికి కన్నడ హాట్ బ్యూటీ రష్మిక మందనాను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ పక్కన ఛాన్స్ రాగానే రష్మిక వెంటనే ఓకే చెప్పేసిందట. వచ్చే ఏడాది మార్చి నెలలో రష్మిక షూటింగులో పాల్గొంటుందట. ఇప్పటికే అల్లు అర్జున్తో ‘పుష్ప’లో హీరోయిన్గా నటిస్తున్న రష్మికకు ఇప్పుడు చరణ్ పక్కన కూడా అవకాశం రావడం లక్కీఛాన్సేనని చెప్పాలి.
ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు తో "సరిలేరు నీకెవ్వరూ" చిత్రం లో నటించింది. ఇక సూపర్ స్టార్ మహేష్ తో నటించింది కాబట్టి పైగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వటం తో ఈ హాట్ బ్యూటీ ఒక్కసారిగా పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయింది.ఇప్పుడు ప్రతి స్టార్ హీరోకి కూడా రష్మిక మందన ఫస్ట్ ఛాయిస్ అయిపోయింది. ఇంకా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి... ఇంకా మరెన్నో మూవీ అప్ డేట్స్ తెలుసుకోండి...