ఎంఎస్ రాజు చాలా రోజుల గ్యాప్ తర్వాత ఒక చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే .. ఫ్రైడే మూవీస్ అనే డిజిటల్ వేదికగా ఎంఎస్ రాజు ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు .. డర్టీ హరి అనే చిత్రాన్ని ఈ నెల 18 న స్ట్రీమింగ్ చేస్తున్నట్లు మూవీ టీం అధికారికంగా ప్రకటించారు ..
ఈ సినిమాలో శ్రావణ్ రెడ్డి , రుహాని శర్మ ,సిమ్రత్ కౌర్ ప్రదం పాత్రల్లో నటిస్తుండగా సతీష్ బాబు మరియు సాయి పునీత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ..ఇప్పుటికే విడుదలైన చిత్ర ట్రైలర్ మరియు వీడియో సాంగ్స్ కి విశేష ఆదరణ లభిస్తున్నాయి .. కేవలం యూత్ ని టార్గెట్ చేసేందుకే ఎంఎస్ రాజు ఈ సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తుంది .. యూత్ కి సంబందించిన సన్నివేశాలు ఈ సినిమాలో పుష్కలంగా దొరుకుతాయని డైరెక్టర్ అంటున్నారు ..
రొమాంటిక్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది .. ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలు వచ్చిన .. సక్సెస్ కి మారుపేరైన ఎంఎస్ రాజు మళ్ళీ ఈ జోనర్ నే ఎంచుకోవడం వెనుక చూస్తే దర్శకుడు ఈ సినిమా కథ విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది .. చూడాలి మరి ఈ డర్టీ హరి సినిమా ప్రేక్షకులని ఎంత మేర మెప్పిస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగవలసిందే ..