వరుస అపజయాలతో సతమతమవుతున్న మన టాలీవుడ్ మాస్ మహరాజ్ రవితేజ ఎట్టకేలకు భారీ హిట్ కొట్టాడు...తాజాగా డైరెక్టర్ గోపిచంద్ మలినేని, రవితేజ ల  కాంబోలో వచ్చిన 'క్రాక్ 'సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది..ఈ సినిమాతో వీరిద్దరి కాంబో హ్యాట్రిక్ హిట్ సాధించింది.. గతంలో వీరి కాంబినేషన్లో డాన్ శీను, బలుపు వంటి సూపర్ హిట్స్ వచ్చాయి... ఈ సినిమాతో మన అందాల రాసి శృతీ హాసన్ రీఎంట్రీ ఇచ్చింది.ఇక ఈ సినిమా కరోనా తర్వాత విడుదల మొట్టమొదటి భారీ బడ్జెట్ సినిమాతోనే కాకుండా మొట్టమొదటి బ్లాక్ బస్టర్‌గా కూడా పేరు తెచ్చుకుంది. ఈ ఏడాదిని మాస్ మహరాజ్ రవితేజ గొప్ప విజయంతో ప్రారంభించాడు.

అయితే ప్రస్తుతం ఈ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేనికి పరిశ్రమలో డిమాండ్ భారీగా పెరిగింది. ఇప్పటి వరకు సరైన హిట్ లేని గోపీచంద్ ఈ సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. టాలీవుడ్ అగ్రహీరోల సైతం అతడి దర్శకత్వంలో సినిమా చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.గోపీచంద్ కథతో సిద్దమైతే తమ డేట్స్ ఇచ్చేందుకు హీరోలు క్యూ కడుతున్నారని వార్తలు వస్తున్నాయి..ఇప్పటికే ఈ దర్శకుడి కోసం బాలయ్య, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలు ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా మన యాక్షన్ హీరో గోపీచంద్ కూడా గోపీచంద్‌ మలినేనితో సినిమా చేయనున్నాడట..మొన్నామధ్య ఈ డైరెక్టర్ మన బాలయ్య కోసం ఓ కథను సిద్ధం చేశాడని...

వీరి కాంబినేషన్లో సినిమా ఉండబోతోందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే..అయితే ఈ వార్తలపై దర్శకుడు గోపిచంద్ మలినేని క్లారిటీ ఇవ్వాలి.. అంతేకాకుండా తన తదుపరి చిత్రం కోసం కూడా అభిమానులు ఎదురుచూస్తున్నారు. త్వరలో తన నూతన చిత్రాన్ని ప్రకటిస్తాడని ఆశిస్తున్నారు...ప్రస్తుతం ఈ డైరెక్టర్ క్రాక్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ ను వైజాగ్ లో నిర్వహించనున్నారు..డైరెక్టర్ గోపిచంద్ తో పాటు హీరో రవితేజ, శృతీ హాసన్, సముద్ర ఖని తదితరులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: