మహేష్ బాబు గురించి అందరికి తెరిచిన పుస్తకమే..కానీ అయన అమ్మమ్మ గురించి బయట ప్రపంచానికి చాలా తక్కువగానే తెలుసు. నిజానికి చిన్నతనం లో మహేష్ బాబు అమ్మమ్మ దుర్గమ్మ దగ్గరే పెరిగాడు. అందుకే ఆయనకు తల్లిదండ్రుల కన్నా అమ్మమ్మతోనే చనువు ఎక్కువ. సినిమాల్లో బిజీ అయ్యాక మద్రాసు అని, హైదరాబాద్ అని తిరగడం వల్ల కాస్త దూరం అయ్యారు. మహేష్ బాబు పెళ్లి విషయం వచ్చేసరికి దుర్గమ్మ అందరికి చుక్కలు చూపించారట. నమ్రత ను ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకుంటాను అని మహేష్ బాబు  చెప్పగానే ఇంట్లో వాళ్ళు ఒక పట్టాన ఒప్పుకోలేదు. ముందు కృష్ణ గారు ఫాన్స్ ని దృష్టి లో పెట్టుకొని ముంబై హీరోయిన్ వద్దు అని అన్నారట. ఎలాగోలా కృష్ణ గారిని కన్విన్స్ చేస్తే, దుర్గమ్మ మాత్రం చస్తే ఒప్పుకోను అని తేల్చి చెప్పారట.

షూటింగ్ లో మహేష్ బాబు చుట్టూ గూఢచారులను సైతం పెట్టిందట, ఎక్కడ తన మనవడిని వలలో వేసుకొని వెళ్లిపోతుందో ముంబై పిల్ల అని. ఇక ఈ పెళ్ళికి ముందు పెద్దలుగా మారింది మహేష్ బాబు అక్కలు మంజుల మరియు పద్మ, అలాగే వారి భర్తలు. వీరు నలుగురు కలిసి కృష్ణ ను ఒప్పించారు. అంతా కలిసి మహేష్ తనకు చెప్పకుండానే పెళ్లి చేస్తారేమో అని మంజులను, పద్మను సైతం ఇంట్లోకి రానివ్వలేదంట. కృష్ణ ను ఒప్పించడానికి నానా కష్టాలు పడ్డ కృష్ణ అక్కలకు దుర్గమ్మను ఒప్పించలేము అని అర్ధం అయ్యింది. అందుకే ముహూర్తం పెట్టి, రేపు పెళ్లి అనేదాకా ఆమెకు విషయం తెలియనివ్వలేదు. ఇక అప్పుడు తెలిసిన ఏమి చేయలేదు కాబట్టి ఒకరోజు ముందు వరకు చెప్పలేదు. ఇక ముహూర్త సమయానికి ఆమె చేసిన గొడవ అంత ఇంతా కాదు. పెళ్లి గురించి దుర్గమ్మ కు బయపడి మీడియాలో కానీ, టీవీ లో కానీ రాకుండా చూసుకున్నారు. అత్యంత సన్నిహితుల మధ్య మారియట్ హోటల్ లో పెళ్లి చాలా సింపుల్ గా జరిగింది. ఇలా మహేష్ బాబు పెళ్లి జరగడానికి కారణం మహేష్ బాబు అమ్మమ్మ దుర్గమ్మ గారే.

మరింత సమాచారం తెలుసుకోండి: