చాలా రోజుల తర్వాత హిట్ కొట్టడంతో మాస్ మహారాజా రవితేజ మంచి జోరుమీదున్నాడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదలైన క్రాక్ సినిమా మంచి కలెక్షన్లు తెచ్చుకుంటూ ముందుకు పోతోంది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించిందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా శృతిహాసన్ నటించింది. తమిళ దర్శకుడు సముద్రఖని అలానే వరలక్ష్మి శరత్ కుమార్ నెగిటివ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాకి ముందు నుంచి మంచి అప్లాజ్ లభిస్తోంది. 


ఇక ఈ సినిమాని ఆహా యాప్ కొనుక్కున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాని ఎప్పుడు యాప్ లో రిలీజ్ చేస్తారు అనే దాని మీద చర్చ జరుగుతోంది. థియేటర్స్ లో మంచి క్రేజ్ ఉండటంతో ఈ సినిమా రిలీజ్ ఇప్పట్లో ఉండదని భావిస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా వచ్చే నెల ఎనిమిదో తారీఖు నుంచి ఆహా యాప్ లో స్ట్రీమ్ కానున్నట్లు చెబుతున్నారు. అప్పటికి ఎలాగూ సినిమా రిలీజ్ చేసి నెల రోజులు దాటుతుంది.


సో అప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేస్తే లీగల్ గా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సో అదే రోజు రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం మొదలైంది. సోనూసూద్ ఈ సినిమాలో హీరోగా నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఆయనే సొంతంగా ఈ సినిమాని నిర్మించి బాలీవుడ్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా రైట్స్ కోసం సోను టీం నిర్మాత ఠాగూర్ మధు ని సంప్రదించినట్లు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: