మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. తన నటన తో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనతో ఎవరూ పోటీ పడలేరు అనే విధంగా పేరు సంపాదించాడు ఈ హీరో. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకు ఎలాంటి అలుపు సొలుపు లేకుండా వరుస సినిమాల్లో పాల్గొంటున్నారు మెగాస్టార్. అందుకే టాలీవుడ్ లో మకుఠం లేని మహారాజుగా వెలుగుందుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం కుర్రహీరోలకు ఏవిధంగా తీసిపోని విధంగా సినిమాల జోరును పెంచాడు. వాటిని ఒక్కొక్కటిగా కంప్లీట్ చేస్తూ తెరముందుకు తీసుకొచ్చే పనిలో  పడ్డారు చిరంజీవి. చిరు సినిమాలు వస్తున్నాయంటే మెగా ఫ్యాన్స్ కు పంగడే ఇక. ఎప్పుడెప్పుడు ఈ హీరో సినిమా వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు.
 గతేడాదిలో ఒక సినిమా కూడా తెరకెక్కించని ఈ హీరో ఈ ఏడాదిలో చాలా సినిమాలనే తెరకెక్కించే పనిలో పడ్డారు.ప్రస్తుతం ఈ హీరో కొరటాల శివ దర్శకత్వంలో  ‘ఆచార్య’ మూవీ చేస్తున్నాడు. ఇందులో చిరు సరసన చందమామ కాజల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా భారీ అంచానాలతోనే రూపొందుతోందని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో చిరుతో పాటుగా తనకొడుకు రామ్ చరణ్ కూడా నటించబోతున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరన్ 40 నిమిషాల పాటు సిద్దు పాత్రలో కనిపిచనున్నాడట. ఈ మధ్యనే ఆచార్య సెట్ లో అడుగు పెట్టాడు చెర్రీ.

ఈ తండ్రీకొడుకులిద్దరు కనిపించనున్న ఆచార్య మూవీపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకుని ఎప్పుడెప్పుడు టీజర్ వస్తుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ‘ఆచార్య’ టీజర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా టీజర్ ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. శుభాకాంక్షలకు తెలుపుతూ జనవరి 26 న రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. అతి తొందరలోనే టీజర్ రిలీజ్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఆచార్య టీజర్ తో మెగాస్టార్  చిరంజీవి రామ్ చరణ్ లు ఏవిధంగా రికార్డులు క్రియేట్ చేస్తారనేది. 

మరింత సమాచారం తెలుసుకోండి: