ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ సముద్రఖని ఒకరుగా నిలిచారు. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన అలా వైకుంఠపురం సినిమాలో అప్పలనాయుడు పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి మంచి విజయం సాధించారు. తరువాత ఈ సంక్రాంతికి రవితేజ "క్రాస్"సినిమాలో కటారి కృష్ణ గా ఎంతో అద్భుతంగా నటించారు.ఈ సినిమా కూడా మంచి ప్రేక్షకాదరణ పొందడంతో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ విలన్ గా సముద్రకని పేరు వినిపిస్తుంది. అయితే ఇంతకు ముందు ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ మంచి గుర్తింపు రాలేదు.

తమిళంలో  మూడు టీవీ చానల్స్ లకు డైరెక్టర్ గా ఎంతో బిజీగా గడుపుతున్న సముద్రకని సినిమాలలో నటించడం కోసం తన దర్శకత్వ బాధ్యతలను కో-డైరెక్టర్స్ కి అప్పగించాడు.తమిళంలో సుబ్రహ్మణ్యపురం మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, కె.బాలచందర్ దగ్గర అసిస్టెంట్  గా చేరి మరి కొన్ని మెళకువలను తెలుసుకున్నారు.క్రాక్ సినిమా కన్నా ముందు రవితేజతో శంభో శివ శంభో సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం తాను నటించిన సినిమాలు విజయవంతం కావడంతో తెలుగులో ప్రముఖ దర్శకుల చూపు ఇతని పై పడింది.

ప్రస్తుతం సముద్రఖని ఇటు తెలుగు, అటు తమిళ ప్రముఖ దర్శకుల చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ , తమిళంలో భారతీయుడు 2, వంటి సినిమాలు సముద్రఖని చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు సినిమాలలో అవకాశాలు రాకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, కనీసం న్యూ ఇయర్, బర్తడే రోజు కూడా తనకు ఒక ఫోన్ కూడా వచ్చేది కాదని, ప్రస్తుతం ఇలాంటి ఫోన్ కాల్స్ ఎన్నో వస్తున్నాయంటూ ఈ సందర్భంగా సముద్రఖని తెలియజేశారు.                                                                                                                                                    

మరింత సమాచారం తెలుసుకోండి: