1946 ఫిబ్రవరి 20న ఆమె తమిళనాడులో ని తెలుగు కుటుంబంలో జన్మించారు.చిన్నప్పటి నుంచి విజయ నిర్మలలో చలాకీ తనం గమనించిన తల్లితండ్రులు ఆమెకు నాట్యంలో శిక్షణ ఇప్పించారు. ఆ తరువాత అక్కడి రాజా గారి విక్టోరియా కోటలో నృత్య ప్రదర్శన ఇచ్చి, రాజా వారి మెప్పును సంపాదించారు. తరువాత నిర్మల కుటుంబం మద్రాసు కు బదిలీ కావడం ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది. ఆ తర్వాత ఆమె బాలనటిగా కెరీర్ ప్రారంభించారు. సినీ రంగంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని హీరోయన్ గా, దర్శకురాలిగా, నిర్మాతగా.. తన సత్తా చాటిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రపంచంలో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళ. గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించింది. ఒక మహిళ దర్శకురాలిగా ఇండస్ట్రీలో చాలా చిత్రాలకు దర్శకత్వం వహించి ఆడవాళ్ళు మగ వాళ్ళ కంటే తక్కువ కాదు అని నిరూపించారు. విజయనిర్మల గారు మీనా చిత్రంతో దర్శకురాలిగా పరిచయమయ్యారు. ఆమె దర్శకత్వంలో నేరము-శిక్ష చివరి సినిమా ఆమె ఫస్ట్ సినిమా సాక్షి అవగా దాంట్లో హీరోగా కృష్ణ గారు చేశారు ఆమె చివరి సినిమా కూడా కృష్ణ గారి తోనే చేశారు అది శ్రీ శ్రీ సినిమా. ఆవిడ చేసిన సినిమాలు సాక్షి’, ‘మీనా’, ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘పట్నవాసం’, ‘అల్లూరి సీతారామరాజు’, ‘పాడిపంటలు’, ‘దేవదాసు’, ‘కురుక్షేత్రం’, పండంటి కాపురం’, ‘బొబ్బిలి దొర’, ‘శ్రావణమాసం’ తో ‘శ్రీశ్రీ’ వరకు అనేక విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించారు.విజయ నిర్మల జూన్ 27 2019 న గుండెపోటుతో చనిపోయారు.
1946 ఫిబ్రవరి 20న ఆమె తమిళనాడులో ని తెలుగు కుటుంబంలో జన్మించారు.చిన్నప్పటి నుంచి విజయ నిర్మలలో చలాకీ తనం గమనించిన తల్లితండ్రులు ఆమెకు నాట్యంలో శిక్షణ ఇప్పించారు. ఆ తరువాత అక్కడి రాజా గారి విక్టోరియా కోటలో నృత్య ప్రదర్శన ఇచ్చి, రాజా వారి మెప్పును సంపాదించారు. తరువాత నిర్మల కుటుంబం మద్రాసు కు బదిలీ కావడం ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది. ఆ తర్వాత ఆమె బాలనటిగా కెరీర్ ప్రారంభించారు. సినీ రంగంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని హీరోయన్ గా, దర్శకురాలిగా, నిర్మాతగా.. తన సత్తా చాటిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రపంచంలో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళ. గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించింది. ఒక మహిళ దర్శకురాలిగా ఇండస్ట్రీలో చాలా చిత్రాలకు దర్శకత్వం వహించి ఆడవాళ్ళు మగ వాళ్ళ కంటే తక్కువ కాదు అని నిరూపించారు. విజయనిర్మల గారు మీనా చిత్రంతో దర్శకురాలిగా పరిచయమయ్యారు. ఆమె దర్శకత్వంలో నేరము-శిక్ష చివరి సినిమా ఆమె ఫస్ట్ సినిమా సాక్షి అవగా దాంట్లో హీరోగా కృష్ణ గారు చేశారు ఆమె చివరి సినిమా కూడా కృష్ణ గారి తోనే చేశారు అది శ్రీ శ్రీ సినిమా. ఆవిడ చేసిన సినిమాలు సాక్షి’, ‘మీనా’, ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘పట్నవాసం’, ‘అల్లూరి సీతారామరాజు’, ‘పాడిపంటలు’, ‘దేవదాసు’, ‘కురుక్షేత్రం’, పండంటి కాపురం’, ‘బొబ్బిలి దొర’, ‘శ్రావణమాసం’ తో ‘శ్రీశ్రీ’ వరకు అనేక విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించారు.విజయ నిర్మల జూన్ 27 2019 న గుండెపోటుతో చనిపోయారు.