యూత్ స్టార్ నితిన్ గతేడాది ‘భీష్మ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ ఏడాది కూడా మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకునేందుకు సిద్దమయ్యాడు ఈ హీరో. ఇప్పటికే ఈ హీరో నటించిన ‘చెక్’ సినిమా ట్రైలర్ తో ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలను పెంచేశాడు. ఇక ఈ సినిమా  ట్రైలర్ తో నితిన్ మరో ఘన విజయం అందుకోబోతున్నారని అర్థమవుతోంది. ఈ సినిమాపై దర్శక ధీరుడు రాజమౌళి కుడా ప్రశంసల జల్లు కురిపించారు. ట్రైలర్ చూసిన జక్కన్న.. ఎప్పుడెప్పుడు ఈ సినిమాను థియేటర్ లో చూస్తానో అంటూ ఆశగా ఎదురు చూస్తున్నానని చెప్పేశారు. ఈ జక్కన్న చెప్పడంతో ప్రేక్షకుల్లో‘చెక్’ సినిమా పట్ల భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఈ మూవీతో పాటుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న  ‘రంగ్ దే’ సినిమాలో కూడా నితిన్ నటిస్తున్నారు. ఈ మూవీలో నితిన్ సరసన మహానటి కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ మార్చి 26  ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తున్నది. కాగా నితిన్, కీర్తి సురేష్, దర్శకుడికి సంబంధించిన ఓ వెరైటీ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి ఇంతకి ఆ ఫోటోలో అంతగా ఏముందబ్బా.. అనుకుంటున్నారా.

ఈ  పిక్ లో వీరు ముగ్గురు చెడు చూడకు.. చెడు వినకు.. చెడు మాట్లాడకు అంటూ ఓ అద్బుత సందేశాన్ని ఇచ్చారు. నితిన్ నోటికి తాళం వేసుకుంటే.. కీర్తి సురేష్ చెవులను మూసుకుంది.. ఇక డైరెక్టర్ ఏకంగా కళ్లనే క్లోజ్ చేశాడు. అంతగా ఏం ఘోరం జరిగిందబ్బా.. వీళ్లు ఇలా రియాక్ట్ అవ్వడానికి? ఒక వేళ వీళ్ల రియాక్షన్ కు కారణం ఏంటో తెలియాలంటే ఖచ్చితంగా ‘రంగ్ దే’ చూడమంటారేమోనని.. ఈ క్యూట్ ఫోటోను నెట్టింట్లో తెగ వైరల్ చేస్తున్నారు నితిన్ అభిమానులు. ఇక ఈ సినిమాకి దేవి శ్రీ ప్రస్తాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. నితిన్ , కీర్తి సురేష్ జోడీకి సరితూగే మాంచి రొమాన్స్ సాంగ్ ను అందించనున్నారట డీఎస్పీ.

మరింత సమాచారం తెలుసుకోండి: