బాహుబలి తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా యాక్టర్ అయ్యారు. అయితే ఆయన నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా జులై 30వ తేదీన విడుదల కానున్నది. రొమాంటిక్ డ్రామా గా వస్తున్న ఈ సినిమాపై సాధారణ స్థాయిలోనే అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రభాస్ సాహో సినిమా తరువాత తాను తీసుకున్న కొన్న నిర్ణయాల కారణంగా ప్రస్తుతం తీవ్ర ఒత్తిడి పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. ఛత్రపతి వంటి సినిమాతో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ మాస్ ప్రేక్షకులను అలరించడానికి ప్రస్తుతం ఏ యాక్షన్ సినిమా కూడా చేయడం లేదు. దీంతో అభిమానులు ఒక మాస్ సినిమా చేయాలని ప్రభాస్ పై ఒత్తిడి తెస్తున్నారు.


దీనితో ప్రశాంత్ నీల్ తో కలిసి ఆయన సలార్ అనే యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఐతే 2014 వ సంవత్సరం లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ అయిన ఉగ్రమ్ సినిమాకి సలార్ మూవీ రీమేక్ అని అంటున్నారు. కానీ ఒరిజినల్ సినిమాని ఉన్నది ఉన్నట్టు తెరకెక్కించకుండా స్క్రిప్టులో చాలా మార్పులు చేశారని తెలుస్తోంది. కానీ ఏడు సంవత్సరాల క్రితం స్టోరీని ఇప్పుడు తమ పై రుద్దటం ఏంటని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అవుట్ డేటెడ్ స్టోరీ తమకు అవసరం లేదని కొంతమంది అంటున్నారు.


ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించనున్నారు. రామాయణం, మహాభారతం ఆధారంగా రూపొందుతున్న ఆదిపురుష్ సినిమాలో ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవని.. ఇది కూడా అంతగా అలరించలేదని ప్రభాస్ అభిమానులు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.


నాగ్ అశ్విన్ తో కలిసి ప్రభాస్ ఓ సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ చేస్తున్నారు. అయితే ఈ సినిమా పూర్తయ్యి విడుదలయ్యే నాటికి కనీసం రెండు సంవత్సరాల సమయం పడుతుంది. ప్రస్తుతం తన మూడు సినిమాలు పూర్తి చేయడానికే ప్రభాస్ నిర్విరామంగా కష్టపడుతున్నారు. ఏకకాలంలో ఎక్కువ సినిమాలు చేయాలని ప్రభాస్ మొదటిసారిగా నిర్ణయం తీసుకొని తీవ్ర పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. త్వరలోనే నాగ్ అశ్విన్ సినిమా కూడా ప్రారంభించే ఆలోచనలో ప్రభాస్ ఉన్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా సాహో సినిమా లాగా కాకుండా అతని తదుపరి మూవీస్ సూపర్ హిట్స్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: