డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒక సినిమా కంప్లీట్ కాకమునుపే మరో సినిమాను సెట్ పైకి తీసుకెళుతున్నాడు ఈ ఆరడుగుల అందగాడు. అయితే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో‘ఆదిపురుష్ 3డి’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను 2022 సంవత్సరంలో  ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని దర్శకనిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ను కూడా షురూ చేసిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అది కూడా ముంబాయి నగరంలోనే చిత్రీకరణ సాగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా తాజాగా ప్రభాస్ ముంబాయిలో సందడి చేసిన వీడియోలు, ఫోటోలు కూడా నెట్టింట్లో తెగ హల్ చల్ చేశాయి.
అయితే ఈ ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన మోషన్ క్యాప్చర్ పనులు ముంబాయిలో షురూ అయినట్టు సమాచారం. అయితే ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించనున్నాడు. అయితే అంతా బాగానే ఉన్నా.. ఇప్పటి వరకు ఈ సినిమాలో అత్యంత కీలకపాత్ర అయిన సీతాదేవి పాత్రలో ఎవరు నటిస్తున్నారన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఆ హీరోయిన్ ఎవరన్న విషయమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ మధ్యన కొందరు బాలీవుడ్ భామల పేర్లు వినిపించాయి. కానీ అవన్నీ వట్టి రూమర్సే నంటూ ఈ చిత్ర యూనిట్ తేల్చేసింది.

ఇక తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.. ప్రముఖ సౌత్ భామ పేరు వినిస్తోంది. చాలా పేర్లను పరిశీలించిన ఈ చిత్ర యూనిట్ కు మహానటి కీర్తి సురేష్ అయితేనే సీతకు బాగా నప్పుతుందని భావించారట. ఈ విషయాన్ని ఈ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ పై డైరెక్టర్లకు సదాభిప్రాయం చాలా వరకు ఏర్పడింది. అది కూడా సాంప్రదాయ బద్దమైన పాత్రలకు కీర్తి బాగా సెట్ అవుతుందని చాలా వరకు భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు సీత పాత్రకు సెలక్ట్ చేసినట్టుగా అర్థమవుతోంది. చూడాలి మరి ఇదే వార్త గనుక నిజమైతే.. కీర్తి సురేష్ పంట పండినట్టే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: