అక్కినేని వారసులు ఇపుడు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. వారు అనుకున్న విధంగా మంచి రోజులు కూడా రాబోతున్నాయని అంతా అంటున్న వేళ ఇది. ఇక వారు వెళ్తున్న దారి కూడా కరెక్ట్ అని అంతా అంచనా వేస్తున్న టైమ్ ఇది.

అయితే అక్కినేని హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఆ ఫ్యూచర్ ఏదో వారికి కళ్లకు కనిపిస్తుంది. అక్కినేని నాగ చైతన్యకు చాలా కాలంగా సరైన హిట్ లేదు. మజిలీ మూవీతోనే హిట్ ఆగిపోయింది. దాంతో కచ్చితంగా ఇపుడు మరో హిట్ పడాలి. ఆ సమయంలో శేఖర్ కమ్ముల మూవీ లవ్ స్టోరీ వచ్చింది. ఫిదా మంచి సూపర్ డూపర్ హిట్ మూవీతో శేఖర్ కమ్ముల టాలీవుడ్ ని అల్లల్లాడించాడు. ఇపుడు ఆయన తరువాత సినిమా ఏంటి అన్న ఆసక్తి ఆడియన్స్ లో ఉంది.

పైగా సాయిపల్లవి హీరోయిన్. మంచి మ్యూజిక్, సారంగధరియా సాంగ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్. ఇలా ఎన్నో ప్లస్ పాయింట్లు ఉన్న లవ్ స్టోరీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిపోయింది. మళ్లీ ఎపుడు రిలీజ్ అవుతుందో ఎవరికీ తెలియదు. దాంతో చైతూ కి నోటి దాకా వచ్చిన హిట్ ఇపుడు మళ్ళీ ఎక్కడో అన్నట్లుగా దూరంగా ఉండిపోయింది.

ఇక మరో అక్కినేని హీరో అఖిల్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈసారి డ్యామ్ ష్యూర్ గా హిట్ అని అనుకుంటున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్. ఈ మూవీ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ తన కసినంతా పెట్టి మూవీని తీశాడు. ఇక హీరోయిన్ కూడా అందరి హాట్ ఫేవరేట్ పూజా హెగ్డే. మరి ఈ సినిమా రిలీజ్ అయితే కచ్చితంగా అఖిల్ ఎక్కడికో వెళ్ళిపోవడం ఖాయం. ఈ మూవీని జూన్ లో రిలీజ్ కి షెడ్యూల్ చేశారు అన్న వార్తలు వచ్చాయి. ఇపుడు కరోనా పేరిట సినిమాలు అన్నీ వాయిదా పడి జూన్ మీదకే వస్తున్నాయి. దాంతో అక్కినేని హీరో అఖిల్ సినిమా రిలీజ్ సంగతి డైలామాలో పడింది. మొత్తానికి చూస్తే రెండూ సూపర్ హిట్ కావాల్సిన సినిమాలే. కానీ కాలం కరోనా రూపంలో బ్యాడ్ గా ఉంది. సో మరి కొంతకాలం వెయిట్ చేయకతప్పదేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: