ఒక్కసారి హీరో డైరెక్టర్ కాంబినేషన్ లో సూపర్ హిట్ మూవీ వచ్చింది అంటే, ఆ తర్వాత ఆ క్రేజీ కాంబినేషన్ పై చాలా అంచనాలే ఏర్పడతాయి. ఇప్పుడు అలాంటి చర్చ ఒకటి టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన జనతా గ్యారేజ్ మూవీ ఏ రేంజ్ లో వసూళ్ల వర్షం కురిపించి ప్రేక్షకుల మన్ననలను పొందిందో అందరికి తెలిసిందే. కథ, పాత్రల చిత్రీకరణ, పాటలు, సంగీతం, సినిమాటోగ్రఫీ ఇలా ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒకటి ఎంతో ప్రశంసనీయం. ఇలా అన్ని రకాలుగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం అలా ప్రజల మనసులో నిలిచిపోయింది.

ఓ వైపు నట ధీరుడు మరో వైపు ప్రతిష్టాత్మక దర్శకత్వం ప్రతిభ కలిగిన డైరెక్టర్ ఇరువురు కలసి పనిచేయడంతో ఈ సినిమా అంత పెద్ద విజయాన్ని సాధించింది అని చెప్పాలి. అయితే ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ లో మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక అప్పటి నుండి ఈ సినిమా కథ ఏంటి..? నటీనటులు ఎవరు..? ఈ సినిమాతో కొరటాల సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు..?  అన్న ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అయితే తాజాగా ఈ సినిమా నుండి ఓ సీక్రెట్  రివీల్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కంటెంట్ ఇదే అంటూ టాక్ వినిపిస్తోంది. ఇంతకీ అదేంటంటే...ఇందులో ఎన్.టి.ఆర్ ఒక చిన్న టౌన్ నుంచి పెద్ద నగరానికి వచ్చి పరిస్థితుల కారణంగా అసాధారణ వ్యక్తిగా మారతారని.. ఆ తరవాత కథేంటో వెండి తెరపైనే చూడాలి అని ఫిల్మ్ సర్కిల్ లో వినిపిస్తోంది.

కథ వినడానికి చాలా సింపుల్ గా రోటీన్ గా ఉన్నప్పటికీ... దర్శకుడు కొరటాల శివ ప్రతిభ గురించి  తెలిసిందే... ఎంత రొటీన్ పాత్రనైనా వైవిధ్యభరితంగా మార్చి ప్రేక్షకుల మెప్పును పొందగల టాలెంటెడ్ దర్శకుడు. కాబట్టి ఈ కథను సరికొత్తగా మలచి వెండితెరపై అద్భుతంగా ప్రెజెంట్ చేస్తాడు అన్న టాక్ నడుస్తోంది. మొత్తానికి కధ మాత్రం ఇదే అని అంటున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఎన్టీఆర్ కానీ, కొరటాల శివ కానీ.. స్పందిస్తే తప్ప తెలీదు.

మరింత సమాచారం తెలుసుకోండి: