దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకు కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య పెరిగిపోతుంది. మహారాష్ట్రలో అయితే కరోనా ప్రళయం కొనసాగుతుందని. ఈ నేపథ్యంలో ఇప్పటికే మహారాష్ట్రలో లాక్ డౌన్ ప్రకటించారు. అంతే కాకుండా తెలంగాణలో సైతం నైట్ కర్ఫ్యూ విదిస్తున్నారు. ఇక కరోనా ఉధృతి నేపథ్యంలో భయటకు వెళ్లాలంటే ప్రజలు కూడా జంకుతున్నారు. అంతే కాకుండా సినిమా షూటింగ్ లకు కొన్ని పరిమితులతో కూడిన అనుమతులు ఇచ్చినప్పటికీ కరోనా భయంతో షూటింగ్ లను వాయిదా వేసుకుంటున్నారు. మరోవైపు షూటింగ్ కు హాజరవ్వడానికి నటీ నటులు సైతం భయపడుతున్నట్టు తెలుస్తోంది. సీనియర్ నటీనటులు ఇలాంటి సమయంలో భయటకు రావాలంటే భయపడుతారు. తాజా సమాచారం ప్రకారం డస్కీ బ్యూటీ పూజా హేగ్డే షూటింగ్ లో పాల్గొనేందుకు నిరాకరించిందట. ప్రస్తుతం పూజా హెడ్గే ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. 

ఇప్పటికే ఈ షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. అయితే కొన్ని సీన్లు మాత్రం ఇంకా పూర్తి చేయలేదట. అంతే కాకుండా కొన్ని సీన్లపై ప్రభాస్ కు డౌట్ రావడం తో రీషూట్ చేయాలనుకున్నారు. మరోవైపు ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురుష్ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడటం తో రాధే శ్యామ్ ను ప్రారంభించారు. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పూజా షూటింగ్ రావడానికి సిద్ధంగా లేదట. ప్రస్తుతం పూజా తన ఇంట్లోనే ఉంటోంది. కరోనా ప్రభావం తగ్గిన తరవాతే మళ్లీ షూటింగ్స్ లో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణం రాజు కూడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణం రాజు సీనియర్ కావడంతో ఆయన కూడా ఇప్పట్లో షూటింగ్ వచ్చేలా కనిపించడం లేదు. దాంతో రాధే శ్యామ్ సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: