సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలాది మంది అభిమానులని ఆయన సొంతం చేసుకున్నాడు.టాలీవుడ్ రికార్డుల రారాజుగా మహేష్ బాబుకి పేరు వుంది. మహేష్ సినిమా హిట్ అయ్యిందంటే అది ఖచ్చితంగా కొత్త రికార్డులని నెలకొల్పుతుంది.ఇలా వరుస హిట్లతో టాలీవుడ్ టాప్ హీరోగా సూపర్ స్టార్ మహేష్ రయ్యిమంటూ దూసుకెళ్లిపోతున్నాడు. ఇక మహేష్ గతేడాది సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరూ' సినిమా చేసిన సంగతి తెలిసిందే.పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఆ సినిమా టాలీవుడ్ లో బాహుబలి సిరీస్, సాహో వంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల తరువాత అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా చరిత్ర సృష్టించింది.


ఇక ఈ సినిమా 138 కోట్ల షేర్ 230 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి గతేడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.అటు మహేష్ కెరీర్ లోను అలాగే అనిల్ రావిపూడి కెరీర్ లోను ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం విశేషం. ఇలా సినిమా విడుదల అయిన దగ్గర నుంచి సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే వుంది.ఇక వెండి తెర మీదే కాదు బుల్లి తెర మీద కూడా  రికార్డులు సృష్టించింది ఈ సినిమా.ఈ సినిమా సంక్రాంతి సీజన్ లో మంచి లాభాలను అందించింది. ఇక ఇప్పటికే టీవీలో 5 సార్లు టెలికాస్ట్ అయిన ఈ సినిమా మంచి TRP ని అందుకుంది. మొదటిసారి 23.4 TRP అందుకున్న మహేష్ 5 వ సాసారి 6.41 TRP ని అందుకుంది.సినిమా విడుదల అయ్యి సంవత్సరం అవుతున్న రికార్డులు సృష్టిస్తుండటం మాత్రం ఆపట్లేదు.ఈ సినిమా మళ్ళీ సూపర్ స్టార్ మహేష్ బాబు రికార్డుల రారాజు అని నిరూపించింది.ఇక ప్రస్తుతం మహేష్ పరశురామ్ పెట్ల దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: