యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కరోనా సోకడంతో ఆయన ప్రస్తుతం క్వారంటైన్కు పరిమితమైన విషయం తెలిసిందే. ఇంట్లో కాస్త కాళీగా ఉన్న ఎన్టీఆర్ను ఓ నేషనల్ మీడియా సంస్థ అయిన `డెడ్లైన్` ఇంటర్వ్యూ చేసింది. దీంతో నిన్నటి నుంచి మొత్తం ఎన్టీఆర్, ఆర్ఆర్ఆర్ అనే అంశాలే హాట్ టాపిక్ గా మారాయి. ఆర్ఆర్ఆర్ సినిమాకు పడ్డ కష్టాల గురించి, తన తదుపరి ప్రాజెక్టుల గురించి ఎన్టీఆర్ పంచుకున్నారు. దీంతో ఆర్ఆర్ఆర్ తరవాత చేయబోతున్నప్రాజెక్ట్ ఏమిటన్న అంశం మీద ఒక క్లారిటీ వచ్చేసింది. కొరటాల శివతో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నాడని ఆయన స్వయంగా క్లారిటీ ఇచ్చేశారు.
`డెడ్లైన్`కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో తన తదుపరి ప్రాజెక్టుపై ఎన్టీఆర్ పెదవి విప్పాడు. 30వ సినిమాను కొరటాల శివతో, 31వ సినిమాను ప్రశాంత్ నీల్ తో చేయనున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించారు. అయితే కొరటాల ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడని చెప్పారు. అయితే.. బుచ్చిబాబుతో చేయబోయే సినిమా గురించి ఎలాంటి హింటూ ఇవ్వలేదు. నిజానికి వీరిద్దరి కాంబోలో ఒక సినిమా ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
నిజానికి `ఉప్పెన`తో ఒక్కసారి అందరి దృష్టిలో పడ్డాడు బుచ్చిబాబు. ఆ తర్వాత ప్రమోషన్స్ సమయంలో ఎన్టీఆర్ కి తన క్లోజ్ అని, ఆయనకు కథ కూడా చెప్పానని బుచ్చిబాబు చెప్పడంతో ఇక వారిద్దరూ కలిసి సినిమా చేయడం ఖాయం అనే ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాని మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోందని అంటున్నారు. ఇక ఈ నేపధ్యంలోనే ఈ ప్రాజెక్టుపై ఎన్టీఆర్ ఎలాంటి హింటూ ఇవ్వక పోవడం సంచలనంగా మారింది. అసలు నిజంగా ఈ సినిమా ఉంటుందా ? లేక ఇదంతా ఒట్టి ప్రచారమేనా ? అని ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.