తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనలో ప్రేక్షకులను మెప్పిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలకృష్ణ సినిమాలు హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటాడు. ఇక ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత బాలయ్య లైనప్ ఓ రేంజ్ లోనే ఉందని తెలుస్తుంది.

ఇక ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగానే మరో మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో మూవీ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి మొత్తం క్రాక్ మూవీకి పనిచేసిన టీమ్ వర్క్ చేయబోతున్నారని సమాచారం. ఇక ప్రత్యేక పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే కచ్చితంగా ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందని అభిమానులు కోరుకుంటున్నారు.

అలాగే మరో మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా బాలయ్యసినిమా చేయబోతున్నట్టు స్వయంగా బాలయ్య క్లారిటీ ఇచ్చారు. ఇక దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ చిత్రం పూర్తయిన తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కూడా బాలయ్యసినిమా చేయబోతున్నాడని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పైసా వసూల్ చిత్రం ఆశించిన ఫలితం రాలేదు. ఇక ఈ సినిమాలో పూరి బాలయ్యను చాలా కొత్తగా చూపించాడు. అయితే వీరి కాంబినేషన్లో మరో సినిమా వస్ట్ చూడాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇక ఈ నేపథ్యంలో పూరి బాలయ్య కోసం ఓ పాన్ ఇండియా సబ్జెక్ట్ ను రెడీ చేసుకుంటున్నారని సమాచారం. అయితే బాలయ్య సొంత బ్యానర్ అయిన ఎన్.బి.కె ఫిల్మ్స్ పతాకం పై ఈ చిత్రం రూపొందే అవకాశం ఉందని టాక్ బలంగా వినిపిస్తునట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: