తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్ లు వస్తుంటారు, పోతుంటారు. కానీ కొందరు మాత్రమే ప్రజల గుండెల్లో బుల్లెట్ లను దించుతుంటారు. అటువంటి అతి తక్కువ డైరెక్టర్ లలో ఒకరే సీనియర్ మరియు మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్. ఈయన వ్యవహారశైలి మిగతా డైరెక్టర్కన్నా చాలా భిన్నంగా ఉంటుంది. తన మైండ్ లో ఏమనుకుంటాడో అదే సినిమాగా తీస్తాడు. ఒక సినిమాను స్టార్ట్ చేశాడంటే టార్గెట్ పెట్టుకున్న సమయం కన్నా ముందే ఫినిష్ చేస్తుంటాడు. అంత పర్ఫెక్ట్ గా షూటింగ్ ప్లాన్ చేసుకుంటాడు. అందుకే పూరి జగన్నాధ్ తో సినిమాలు తీయడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపు 15 సంవత్సరాల క్రితం వచ్చిన పోకిరి సినిమా పూరి జగన్నాధ్ లోని సరికొత్త దర్శకుడిని పరిచయం చేసింది.
 ఈ సినిమాలో తన డైలాగ్స్, స్క్రీన్ ప్లే, టేకింగ్ ఒకటేమిటి అన్నీ సూపర్ అంతే. ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా చేశాడు. వీరిద్దరికీ సరిగ్గా సూట్ అయింది. ఇద్దరిలోనూ మంచి ఫైర్ ఉంది. ఆ ఫైర్ సినిమా కథకు పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఇంకేముంది సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఈ సినిమా గురించి ఈ రోజుకీ మాట్లాడుకుంటున్నారు, అంతలా ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. ఆ తరువాత ప్రేక్షకుల కోరిక మేరకు మళ్ళీ పూరి జగన్నాధ్ మహేష్ తో మరో గ్యాంగ్ స్టర్ కథతో మనముందుకొచ్చాడు. 2012 లో వీరిద్దరి కాంబోలో వచ్చిన రెండవ చిత్రం "బిజినెస్ మేన్". ఈ చిత్రంలో సూర్య అనే గ్యాంగ్ స్టర్ పాత్రలో ముంబైని ఉచ్చ పోయించాడు. ఈ సినిమా "ధనా ధన్" లాగా చూస్తుండగానే అప్పుడే అయిపోయిందా అన్న ఫీలింగ్ వస్తుంది. దీనితో ఈ ఇద్దరి కాంబినేషన్ ఇండస్ట్రీ అంతా మారుమ్రోగిపోయింది.
 
అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కథలను పరిశీలించడమూ అయింది. కానీ ఎందుకో ఏదీ కార్యరూపం దాల్చలేదు. ఒకవైపు పూరి తన సినిమాలతో బిజీ అయిపోయాడు. మరోవైపు మహేష్ కూడా కొత్త కొత్త డైరెక్టర్ లతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే ఇప్పటికీ ప్రేక్షకులు వీరిద్దరూ కలిసి సినిమా చేయాలని ఆశ పడుతున్నారు. మరి వీరి కోరిక ఎప్పటికి తీరుతుందో అర్ధం కావడం లేదు. కాగా ప్రస్తుతం మహేష్ బాబు "సర్కారు వారి పాట" సినిమాతో బిజీగా ఉండగా, పూరి విజయ్ దేవరకొండ  హీరోగా లైగర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. భవిష్యత్తులో అయినా వీరిద్దరి కలయికలో సినిమా ఉంటుందా చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: