ఆర్కా మీడియా పతాకంపై యార్లగడ్డ శోభు, దేవినేని ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో సునీల్ సరసన సలోని నటించగా తన ఇంటి గడప దాటెంతవరకు అతిధి ప్రాణాన్ని తియ్యని ఒక ఊరి పెద్ద ఇంటికి వెళ్లి తన తండ్రికి ఆ పెద్దమనిషికి తగాదాలు ఉన్నాయని తెలుసుకుని తన ప్రాణాలను కాపాడుకోవాలి అనే ఓ యువకుడి కథను వివరించే ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ ను అందుకుని భారీ విజయాన్ని చవి చూసింది. ఇప్పటికే కమెడియన్ నుంచి హీరోగా మారి రెండు మూడు హిట్లు కొట్టిన సునీల్ కి ఈ సినిమా హిట్ ఎంతో బూస్ట్ ఇచ్చింది.
కన్నడలో కూడా మర్యాద రామన్న అనే పేరుతో రీమేక్ అయింది ఈ చిత్రం బెంగాలీలో మరియు హిందీలో కూడా ఈ సినిమా రీమేక్ అయింది. తమిళం లో, మలయాళం లో సైతం ఈ సినిమా రీమేక్ అయింది అంటే ఏ రేంజ్ లో ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందో అర్థం చేసుకోవచ్చు. 12 కోట్ల చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 40 కోట్ల వసూళ్లను సాధించి సునీల్ కెరియర్లోనే ఆల్ టైం హిట్ గా నిలిచింది. 2010 జూలై 23న విడుదల కాగా ఈ సినిమాలో విలన్ గా తీసిన నాగినీడు కి మంచి పేరు వచ్చింది.