దర్శకుడు బోయపాటి శ్రీను, బాలయ్య కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. వీరి కాంబినేషన్ లో ఇప్పటికే తెరకెక్కిన సింహా, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలవగా, ఇప్పుడు ఈ సినిమాపై అంతకు మించిన భారీ అంచనాలు ఉన్నాయి. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమాలో హీరో బాలకృష్ణ మొట్ట మొదటిసారిగా అఘోర పాత్రలో నటిస్తుండడం విశేషం. ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న సంగీత దర్శకుడు తమన్ అఖండ మూవీకి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
ఇలా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఉదయభాను రీఎంట్రీ ఉండబోతోందన్న వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇలాంటి అద్భుతమైన కాంబినేషన్ లో వస్తున్న అఖండ సినిమా ద్వారా ఉదయభాను కెరీర్ మళ్ళీ ఉపందుకుంటుందా లేదా అన్నది ఆమె పెర్ఫార్మన్స్ పై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలయిన పోస్టర్, టీజర్ లు ప్రేక్షకులను ఆకట్టుకుని అంచనాలను మరింత పెంచాయి. మరి ఈ అంచనాలను అందుకోవడంలో బాలయ్య సక్సెస్ అవుతాడా లేదా చూడాలి.