టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ హీరో శర్వానంద్ ల మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉన్న సంగతి తెలిసిందే. స్కూల్ డేస్ నుంచే వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. అయితే తన ప్రెండ్ శర్వానంద్ ని హీరోగా పెట్టి ఓ స్టార్ డైరెక్టర్ తో సినిమాని ప్లాన్ చేస్తూన్నాడట రామ్ చరణ్. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ లో రొటీన్ కి భిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న శర్వానంద్ .ఇటీవలే శ్రీకారం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. సినిమా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినా.. కంటెంట్ విషయంలో మాత్రం ప్రశంసలు అందుకుంది.

 ఇక తాజాగా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే సినిమాలో నటిస్తున్నాడు శర్వానంద్. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. శర్వానంద్ సరసన రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఇక ఇదిలా ఉండగా మెగా హీరో రామ్ చరణ్ నిర్మాతగా శర్వానంద్ తో ఓ సినిమాని ప్లాన్ చేస్తున్నాడట. టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించే సూచనలు కనిపిస్తున్నాయి.అయితే త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబు తో ఓ సినిమాకి కమిటయ్యాడు. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళడానికి కొంత సమయం పట్టనుండటంతో త్రివిక్రమ్ కూడా ఈ ప్రాజెక్ట్ కు ఒకే చెప్పినట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

 కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమాను రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేయనున్నారట.ఇప్పటికే దీనికి సంబంధించి తెర వెనుక పనులు జరుగుతున్నట్లు ఇండ్రస్టీ వర్గాల సమాచారం.మరి కొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అఫిషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వబోతున్నట్లు సమాచారం వినిపిస్తోంది.ఇక రామ్ చరణ్ ప్రస్తుతం rrr సినిమాతో పాటుగా సంచలన దర్శకుడు శంకర్ తో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఇప్పటికే అధికార ప్రకటన వెలువడిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించనున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: